ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరైంది. 2 లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరు జమానత్ పై బెయిల్ మంజూరు చేశారు. చిదంబరం పాస్ పోర్టు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు ఆర్.భానుమతి, ఏఎస్ బోపన్న, హృషికేష్ రాయ్తో కూడిన ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో 105 రోజుల జైలు తర్వాత చిదంబరానికి బెయిలు దొరికినట్టయింది. అక్టోబర్ 21ను ఆయన అరెస్ట్ అయ్యారు.