Nuclear Milestone: అణురంగంలో నిర్ణయాత్మక అడుగు పడింది.. ప్రధాని మోడీ
Nuclear Milestone: భారత అణురంగంలో నిర్ణయాత్మకమైన అడుగు పడింది. కల్పకంలో 500 మెగా వాట్ల మోడల్ ఫాస్ట్ బీరీడార్ రియాక్టర్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి.
Nuclear Milestone
Nuclear Milestone: అణు రంగంలో భారతదేశం ఈ రోజు ఒక నిర్ణయాత్మక అడుగు వేసింది. మన అణు కార్యక్రమం రెండవ దశను పూర్తి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కల్పక్కంలోని భారతదేశపు 500 మెగావాట్ల మోడల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. దేశ పౌర అణు కార్యక్రమం రెండవ దశను ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఒక నిర్ణయాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు.
ఈ రోజు Xలో పోస్ట్ చేస్తూ, కల్పక్కంలో స్థానికంగా రూపొందించి, నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నమూనా క్రిటికల్ మాస్కు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. తాను వినియోగించే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల ఈ అధునాతన రియాక్టర్ మన ప్రతిభావంతమైన శాస్త్రీయ సామర్ధ్యాన్ని, మన ఇంజనీరింగ్ పరిశ్రమ బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
కార్యక్రమం మూడవ దశలో మన అపారమైన థోరియం నిల్వలను వినియోగించుకోవడంలో ఇది ఒక కీలకమైన అడుగుగా చెప్పిన ప్రధాని మోదీ.. భారతదేశానికి ఇది గర్వకారణంఅని తన X పోస్ట్ లో పేర్కొన్నారు.
మూడో దశలో థోరియం..
కల్పక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కేవలం ఒక శాస్త్రీయ మైలురాయి మాత్రమే కాదు. ఇది కేవలం రెండవ దశ మాత్రమే. ఇది మూడవ దశలో మన థోరియం నిల్వలను వెలికితీస్తుంది, అవి ప్రపంచంలోనే అతిపెద్దవిగా ఉంటాయి.
కరెంట్ కష్టాలకు చెక్..
ఈ రియాక్టర్ యురేనియంను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు ప్లూటోనియంను కూడా తయారు చేస్తుంది. భవిష్యత్తులో థోరియంను ఇంధనంగా మార్చడానికి ఈ ప్లూటోనియంను ఉపయోగిస్తారు. మనం మూడవ దశకు (థోరియం ఆధారిత రియాక్టర్) చేరుకున్న తర్వాత, రాబోయే 250-300 సంవత్సరాల వరకు భారతదేశం విద్యుత్తు కోసం మరే ఇతర దేశాన్ని అడగాల్సిన అవసరం ఉండదు.
2004లో పీఎఫ్బీఆర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు అనేకసార్లు ఆలస్యం అయింది. దీంతో ప్రారంభంలో అంచనా వేసిన రూ. 5,677 కోట్ల వ్యయం సుమారు రూ. 7,600 కోట్లకు పెరిగింది. అణుశక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్బీ) 2024 జూలైలో మొదటి ఇంధన లోడింగ్కు ఆమోదం తెలిపింది. అధికారిక ప్రకటనల ప్రకారం, కోర్ లోడింగ్ కార్యకలాపాలు 2024 మార్చిలో ప్రారంభమయ్యాయి.