Indian Railways: రైల్వేస్టేషన్లలో మాస్క్‌ లేదంటే రూ.500 ఫైన్‌

Update: 2021-04-17 16:15 GMT

రైల్వేస్టేషన్లలో మాస్క్‌ 

Indian Railways: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతితో రైల్వే శాఖ అలర్ట్‌ అయ్యింది. వైరస్‌ కట్టడిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే పరిసరాలు, రైళ్లలో మాస్క్‌ ధరించకపోతే నేరంగా పరిగణించి, 500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఆరు నెలల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఇవి అమలులో ఉంటాయని వెల్లడించింది.

Tags:    

Similar News