India Pakistan Relations: పాకిస్థాన్ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 23 వరకూ పొడిగించిన భారత్
India Pakistan Relations: పాకిస్థాన్కు చెందిన విమానాలపై భారత గగనతల ప్రయాణ నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం, పాక్ విమానాలు ఆగస్టు 23 వరకూ భారత గగనతలాన్ని ఉపయోగించలేవు.
India Pakistan Relations: పాకిస్థాన్ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 23 వరకూ పొడిగించిన భారత్
India Pakistan Relations: పాకిస్థాన్కు చెందిన విమానాలపై భారత గగనతల ప్రయాణ నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం, పాక్ విమానాలు ఆగస్టు 23 వరకూ భారత గగనతలాన్ని ఉపయోగించలేవు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విటర్) ద్వారా అధికారికంగా వెల్లడించారు.
“పాకిస్థాన్ విమానాలపై భారత్ గగనతల నిషేధం ఆగస్టు 23 వరకూ పొడిగించబడింది. ఇది ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్కు అనుగుణంగా తీసుకున్న చర్య,” అని మంత్రి మురళీధర్ స్పష్టం చేశారు. ఎయిర్మెన్ నోటీసు (NOTAM) రూపంలో ఈ నిషేధాన్ని పొడిగించినట్టు తెలిపారు.
ఈ నిర్ణయం పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయానికి ప్రత్యుత్తరంగా వచ్చినది. గత వారం పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ (పీఏఏ) భారత్కు చెందిన వాణిజ్య మరియు సైనిక విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.
ఉగ్రదాడుల అనంతరం మొదలైన ఆంక్షలు
ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఏప్రిల్ 30న తొలిసారి పాకిస్థాన్ విమానాలపై నిషేధాన్ని విధించింది. అప్పటి నుంచి ఈ ఆంక్షలను పునఃపరిశీలిస్తూ వరుసగా పొడిగిస్తూ వస్తోంది. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి జులై 24 వరకు గగనతల నిషేధం కొనసాగిన తరవాత, తాజాగా మరోసారి ఈ ఆంక్షల గడువును భారత్ పొడిగించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వైపాక్షిక వైమానిక సంబంధాలపై ప్రభావం చూపనుంది.