జులై 1 నుంచి ఛార్‌ధామ్‌ యాత్రకు ఉత్తరాఖండ్‌ అనుమతి.. హైకోర్టు వద్దని చెప్పినా..

Char Dham Yatra: జూలై 1 నుంచి ఛార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2021-06-29 16:00 GMT

జులై 1 నుంచి ఛార్‌ధామ్‌ యాత్రకు ఉత్తరాఖండ్‌ అనుమతి.. హైకోర్టు వద్దని చెప్పినా..

Char Dham Yatra: జూలై 1 నుంచి ఛార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఛార్ థామ్ యాత్ర నిర్వహణకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదు. ఛార్ థామ్ యాత్రకు కోవిడ్ నెగిటవ్ రిపోర్టు తప్పనిసరి చేస్తూ కోవిడ్ గైడ్‌లైన్స్ కూడా జారీ చేసింది. తొలి దశ యాత్ర జూలై 1న ప్రారంభమవుతుందని, రెండో దశ 11 నుంచి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఛార్ థామ్ యాత్రను పరిమిత యాత్రికులతో అనుమతించాలని ఈ నెల 25న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే ఇచ్చిన కొద్ది గంటలకే యాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Tags:    

Similar News