Marriage: కుమారుడి మృతితో ఒంటరైన 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ..!
Marriage: ఉత్తర్ప్రదేశ్లో 70 ఏళ్ల మామ 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్నాడు.
Marriage: ఉత్తర్ప్రదేశ్లో 70 ఏళ్ల మామ 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్నాడు. గోరఖ్పూర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామంలో కైలాశ్ యాదవ్ అనే వ్యక్తి తన కోడలిని వివాహం చేసుకున్నారు. పన్నెండేళ్ల క్రితం కైలాశ్ యాదవ్ భార్య చనిపోవడంతో కొడుకుల వద్దనే ఆయన నివాసిస్తున్నాడు. కైలాశ్ యాదవ్ కు నలుగురు సంతానం. అయితే కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు మరణించారు. దీంతో అతడి భార్య పూజ ఒంటరిగా మిగిలింది. ఇదిలా ఉండగా ఇటీవలే కైలాశ్ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పూజ నుదుట కైలాశ్ సింధూరం దిద్దాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.