ఆస్ట్రేలియా రక్షణమంత్రితో మాట్లాడిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌

Update: 2020-05-26 11:17 GMT

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో అనుసరించవలసిన వ్యూహాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి లిండా రెనాల్డ్స్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. కొవిడ్‌ మహ్మారిపై పోరులో భాగంగా తీసుకుంటున్న చర్యల గురించి ఇరువురు మాట్లాడినట్లు సమాచారం. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఇరు దేశాలు కలసి పని చేసే అవకాశాలపైనా వీరిద్దరూ చర్చించారు. కోవిడ్‌ తదనంతరం ఛాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక సహకారంతో ముందుకెళ్లాల్సిందిగా అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య దైపాక్షిక సమావేశాలు, రక్షణ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా నేతలిరువురు పేర్కొన్నారు.

 

Tags:    

Similar News