మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు .. ముంబైలోనే 10వేలు...
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాడవం చేస్తుంది.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాడవం చేస్తుంది. బుధవారం ఒక్కరోజే 1,233 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లోనే 34 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరగా.. 651 మంది ఈ మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు.
ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్కు దాటింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 769 కేసులు నమోదు కాగా.. 25 మంది మరణించారు. అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా సోకింది. ముంబైలో కేసుల 10,527కి చేరుకోగా.. 412 మంది మరణించిట్లు ముంబై బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.ముంబయిలోని ధారవిలో కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదుకా. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.