Delhi Police: మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై వివాదం: పెంగ్విన్ సంస్థకు ఢిల్లీ పోలీసుల నోటీసులు!

Delhi Police: భారత సైన్యం మాజీ అధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఆత్మకథ ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ (Four Stars of Destiny) ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా పెను దుమారాన్ని రేపుతోంది.

Update: 2026-02-11 08:51 GMT

Delhi Police: భారత సైన్యం మాజీ అధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఆత్మకథ ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ (Four Stars of Destiny) ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా పెను దుమారాన్ని రేపుతోంది. ఈ పుస్తక ప్రచురణకర్త అయిన పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌజ్‌ ఇండియా (PRHI)కు ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

విచారణకు హాజరుకావాలని ఆదేశం:

పుస్తక ప్రచురణకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ప్రచురణ సంస్థ యాజమాన్యం విచారణకు హాజరుకావాలని పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా: ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాని ఈ పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయి? ప్రభుత్వ అనుమతి రాకముందే ఈ పుస్తకాన్ని ఎలా సిద్ధం చేశారు? వంటి పలు కీలక ప్రశ్నలకు వివరణ కోరారు.

అసలు వివాదం ఏమిటి?

సైన్యంలో ఉన్నత హోదాల్లో పనిచేసిన వారు తమ అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చేటప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే, అనుమతి రాకముందే ఈ పుస్తకం బయటకు రావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పుస్తకం ఇంకా మార్కెట్‌లో అందుబాటులో లేదని, రిటైల్ వేదికల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచలేదని పెంగ్విన్ సంస్థ చెబుతోంది. మరోవైపు, ఈ పుస్తకం ఇప్పటికే మార్కెట్‌లో దొరుకుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేశాయి.

ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఏవైనా ఇందులో ప్రస్తావించారా అనే కోణంలోనూ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News