BJP MLA Debendra Nath Roy : అనుమానాస్పద స్థితిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి!

Update: 2020-07-13 05:53 GMT

BJP MLA Debendra Nath Roy : పశ్చిమ బెంగాల్ లో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా హేమ్‌తాబాద్ నియోజకవర్గ బీజేపీ శాసన సభ్యుడు దేబేంద్ర నాథ్ రాయ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. బీజేపీ ఎమ్మెల్యే గ్రామం బిందాల్‌లో తన ఇంటికి సమీపంలో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై కుటుంబ స‌భ్యులు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య కాదు.. ఇది రాజ‌కీయ హ‌త్యే అని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. హ‌త్య చేసి ఉరేశార‌ని పేర్కొన్నారు. సీబీఐ చేత విచారణ జరపాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మృతికి కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాయ్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News