రైతుల ఆందోళనపై ప్రకటన చేయనున్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

Update: 2020-12-10 07:45 GMT

ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ప్రకటన చేయనున్నారు. రైతు సంఘాలు ఆందోళనలు విరమించి.. ప్రభుత్వానికి సహకరించాలని కోరనున్నారు. కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరించిన రైతులు నిన్న ఆందోళనలపై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్ 12న ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా రహదారుల దిగ్బంధనం, ఇక టోల్‌ వసూలు చేయకుండా అడ్డుకోవడం, డిసెంబర్‌ 14న దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాలు.

Tags:    

Similar News