Coronavirus: కొంపముంచిన గోవా టూర్.. క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం..

Cruise Ship: ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం రేగింది.

Update: 2022-01-03 11:58 GMT

Coronavirus: కొంపముంచిన గోవా టూర్.. క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం..

Cruise Ship: ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం రేగింది. నౌకలో 66 మందికి పాజిటివ్ అని తేలడంతో నౌకను తీరంలోనే నిలిపివేశారు. మొదట నౌకలో సిబ్బంది ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనుమానంతో నౌకను తీరంలోనే నిలిపేసి పరీక్షలు నిర్వహించారు. దీంట్లో 66 మందికి పాజిటివ్ అని తేలింది. ముంబయి పోర్ట్‌ నుంచి 2016 మంది ప్రయాణికులు, సిబ్బందితో కార్డెలియా క్రూయిజ్‌ నౌక గోవాకు బయల్దేరింది.

సిబ్బందికి కరోనా సోకినట్లు తేలగానే నౌకను మోర్ముగావ్‌ తీరంలో నిలిపారు. ప్రయాణికులెవరూ నౌక నుంచి దిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. దీంతో నిన్నటి నుంచి వారంతా షిప్‌లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా నౌకలో ఎక్కిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నవారేనని కార్డెలియా క్రూజ్‌ ప్రతినిధులు తెలిపారు.

Tags:    

Similar News