మిథునం రీమేక్ : ఎస్పీబీ పాత్రలో అమితాబ్‌..!

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Update: 2020-11-28 09:21 GMT

తెలుగు సినిమాలో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. కానీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి సినిమాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీ లక్ష్మి నటించిన మిథునం సినిమా ఒకటి. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేవలం రెండే పాత్రలతో తనికెళ్ల భరణి తెరకెక్కించిన విధానం అందరిని కట్టిపడేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిందని సమాచారం. సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందని సమాచారం.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా రీమెక్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, అందాల తార రేఖ నటించానున్నారని బోగోట్టా. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఈ కాంబినేషన్‌ కుదిరితే అభిమానులకు పండుగనే చెప్పాలి. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. 

Tags:    

Similar News