Hero Sushanth Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరో సుశాంత్

Hero Sushanth Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Update: 2020-08-21 10:03 GMT

Tollywood Hero Sushanth Accept Green India Challenge

Hero Sushanth Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగా తాజాగా అక్కినేని హీరో సుశాంత్ ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

నటుడు అక్కినేని నాగచైతన్య విసిరిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ని స్వీకరించిన హీరో సుశాంత్.. ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో తనని కూడా భాగస్వామ్యం చేసినందుకు గాను నాగచైతన్యకి కృతజ్ఞతలు తెలిపారు..ఇక ఎంపీ సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఇంతటి వినూత్నమైన కార్యక్రమం రూపొందించడం చాలా గొప్పదని, గర్వించదగ్గ విషయమని అన్నారు.

ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు పూజా హెగ్డే, ఐశ్వర్యా రాజేష్‌తో పాటు సాహో దర్శకుడు సుజిత్‌కు, బాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ లను మొక్కలు నాటాలని సుశాంత్ చాలెంజ్ విసిరారు. ఇక సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాని చేస్తున్నాడు.  



Tags:    

Similar News