గాడ్సే నిజమైన దేశభక్తుడు : నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సినీనటుడు, జనసేన నేత నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సినీనటుడు, జనసేన నేత నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను ప్రశంసించారు. గాడ్సే నిజమైన దేశభక్తుడు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీని చంపితే ..అని అన్నారు.
ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు.