Movie News: డైరెక్టర్ కి సురేష్ బాబు క్లాస్..

Movie News: డైరక్టర్ కి సురేష్ బాబు క్లాస్..

Update: 2022-09-15 05:23 GMT

Movie News: డైరక్టర్ కి సురేష్ బాబు క్లాస్..

Suresh Babu: రెజీనా కసాండ్రా మరియు నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన "శాకిని డాకిని" సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సౌత్ కొరియాలో యాక్షన్ కామెడీగా విడుదలై సూపర్ హిట్ అయిన "మిడ్ నైట్ రన్నర్స్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

అయితే చాలా వరకు చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లకు డైరెక్టర్ సుధీర్ వర్మ దూరంగా ఉండడంతో సుదీర్ వర్మ కి మరియు చిత్ర నిర్మాతలకి మధ్య గొడవ జరిగిందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ సినిమా నిర్మాత సునీత తాటి క్లారిటీ ఇచ్చారు. సినిమాకి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ తన తదుపరి సినిమా అయిన "రావణాసుర" సినిమాతో బిజీగా ఉన్నారని అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కి రాలేకపోతున్నారని తెలిపారు.

అయితే ఎంత నిర్మాత చెప్పినప్పటికీ అది అంత నమ్మేసక్యంగా లేదు. ఎందుకంటే ఎంత వేరే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా ఒకే సిటీలో ఉంటూ తన సినిమా ప్రమోషన్స్ కి రాకుండా సుధీర్ వర్మ ఉండరేమో. మరోవైపు సురేష్ బాబు స్వయంగా వెళ్లి సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండటం సబబు కాదని సుధీర్ వర్మకి పెద్ద క్లాస్ తీసుకొని కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూల లో పాలుపంచుకోమని సలహా ఇచ్చారట. సుధీర్ వర్మ కూడా దీనికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి సుధీర్ వర్మ ప్రమోషన్స్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.

Tags:    

Similar News