శ్రీవారిని దర్శించుకున్న సింగర్‌ సునీత.. మంచి వివాహ జీవితం..

Update: 2020-12-31 09:10 GMT

తిరుమల శ్రీవారిని సింగర్ సునీత దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 9న తన వివాహం జరగనున్న క్రమంలో తనకు మంచి వివాహ జీవితం ప్రసాదించమని స్వామి వారిని వేడుకున్నట్లు సునిత తెలిపారు. కాగా, వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో కొద్దిరోజుల క్రితం సునీతకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో‌ డిసెంబర్‌ 20 ఆదివారం రాత్రి సునీత, రామ్‌ల ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమం జరిగింది. టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

Tags:    

Similar News