Sai Dharam Tej : అల్లుడు సినిమాకి మామ క్లాప్

గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలతో మంచి హిట్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్న సాయి తేజ్ తన తదుపరి చిత్రానికి పచ్చా జెండా ఉపేశాడు.

Update: 2020-03-12 05:55 GMT

గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలతో మంచి హిట్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్న సాయి తేజ్ తన తదుపరి చిత్రానికి పచ్చా జెండా ఉపేశాడు.. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తన కొత్త సినిమాని మొదలు పెట్టాడు సాయి. ఇందులో సాయి తేజ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది సాయి ధరమ్ తేజ్ కి 14 వ సినిమా కావడం విశేషం.. 

ఈ సినిమా ముహూర్తపు సన్నివేశాన్ని ఈ రోజు చిత్రీకరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చి సాయి ధరమ్ తేజ్ , నివేతా పెతురాజ్ లపై క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు. ఇక రెబల్, గౌతమ్ నంద సినిమాలను తెరకెక్కించిన నిర్మాతలు జె.భగవాన్ మరియు పుల్లారావు గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ప్రస్థానం లాంటి పవర్ ఫుల్ సినిమాని చేసిన దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ సినిమా చేస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

సోలో బతుకే సో బెటర్

ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా 'సోలోబ్రతుకే సో బెటర్‌' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నభా నటేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది. సినిమాని మే మొదటివారంలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.  


Tags:    

Similar News