డబ్బింగ్ పనులతో బిజీ అయిన 'చిత్రాలహరి' టీం

Update: 2019-02-12 12:22 GMT

వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఎటూ కాకుండా పోయింది. 'సుప్రీమ్' సినిమా తర్వాత ఒక మంచి హిట్టు కూడా అందుకోలేకపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ మధ్యనే విడుదలైన 'తేజ్ ఐ లవ్ యు' సినిమా కూడా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసింది. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'చిత్రలహరి' పైనే పెట్టుకున్నాడు. కనీసం ఈ సినిమాతో అయినా తేజు తేజు ఒక మంచి హిట్ అందుకుంటే బాగుండు అని మెగా అభిమానులు కూడా ఆశపడుతున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ కూడా ముఖ్య పాత్ర పోషించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం డబ్బింగ్ పనులను మొదలు పెట్టింది. ప్రస్తుతం సునీల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రొమాంటిక్ డ్రామాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Similar News