సమన్లు జారీ చేశాం.. రకుల్ నుంచి నో రెస్పాన్స్ : ఎన్‌సీబీ

Rakul Preet Singh : బాలీవుడ్ లో డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్‌సీబీ విచారణలో భాగంగా నటి రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీల

Update: 2020-09-24 08:38 GMT

Rakul Preet Singh

Rakul Preet Singh : బాలీవుడ్ లో డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్‌సీబీ విచారణలో భాగంగా నటి రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీల పేర్లు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆమె వెల్లడించిన జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకోనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్ట లతో పాటుగా పలువురు పేర్లు ఉన్నట్టుగా ఆ వార్తల్లో వినిపించాయి.. అయితే తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) దీపికా పదుకోనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు నోటిసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.

అయితే తనకి ఎలాంటి నోటిసులు అందలేదని రకుల్‌ ప్రీత్‌ సింగ్ అంటుంది.. ఈ మేరకు ఆమె మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రకుల్ కి ఎన్‌సీబీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని వెల్లడించారు. అయితే ఈ వార్తలను ఎన్‌సీబీ ఖండిస్తోంది.. ఎన్‌సీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆమెకు సమన్లు జారీ చేశాం.. ఏజెన్సీతో అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్‌తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు మాత్రమె... ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు" అని వెల్లడించారు.

ఏజెన్సీ ముందు హాజరు కావడానికి ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్ట గురువారం ఉదయం ముంబై లోని ఆమె నివాసం నుంచి ఎన్‌సిబి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఆమె ఉదయం 9.30 గంటల సమయంలో ఎన్‌సిబి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. 

Tags:    

Similar News