విజయశాంతి నన్నెందుకు తిట్టావ్? చిరంజీవి సూటి ప్రశ్న!

Update: 2020-01-05 17:00 GMT
Chiranjeevi , Vijaya Shanti File Photo

సరిలేరు నీకెవ్వరూ సినిమా సరికొత్త సీన్ ఆవిష్కరించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అత్యంత వైభవంగా జరిగింది. దీనిలో ప్రధాన ఆకర్షణగా చిరంజీవి..విజయశాంతి నిలిచారు. చిరంజీవి మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. విజయశాంతి గురించి మాట్లాడుతూ ఎప్పుడో ఇరవై ఎల్లా క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది నా హీరోయిన్ మల్లె ఇన్నాళ్ళకు నాకు కనిపించింది అన్నారు. తరువాత విజయశాంతి ని దగ్గరకు పిలిచారు. ఆమెను పొదివి పట్టుకుని నేనో ప్రశ్న అడుగుతా జవాబు చెబుతావా అన్నారు. విజయశాంతి తప్పకుండా అన్నారు.

నువ్వు రాజకీయాల్లోకి వెల్లి ఎన్నాళ్ళు అయింది? అని చిరంజీవి ప్రశ్నించారు.22 ఏళ్ళు అయినట్టు విజయశాంతి చెప్పారు. నువ్వు రాజకీయాల్లోకి నా కంటే ముందు వెళ్ళవు కదా.. మరి వెనుక వచ్చిన నన్నెందుకు తిట్టావు? అని సూటిగా అడిగారు. దానికి విజయశాంతి షాక్ అయ్యారు. తరువాత తమాయించుకుని రాజకీయాలు కదా అన్నారు. కానీ  చిరంజీవి వదలలేదు. నేను ఎప్పుడన్నా చిన్న మాట నిన్ను అన్నానా? లేదు కదా.. మరి నువ్వెందుకు నన్ను అన్నావు అంటూ మళ్ళీ ప్రశ్నించారు. ఇలా కొద్దిసేపు రాజకీయాల గురించి చిరంజీవి విజయశాంతి మధ్యలో సంభాషణలు నడిచాయి.

తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. రాజకీయాలు అంటేనే అంతా అవి శత్రుత్వాన్ని పెంచుతాయి. సినిమా అమ్మలాంటిది, ఇది స్నేహాన్ని పెంచుతుంది. ఏదేమైనా మా హీరోయిన్ విజయశాంతిని నన్ను మళ్లి ఒక దగ్గర కలుపుతూ.. సినిమా ఫంక్షన్లో కలిపిన మహేష్ బాబుకు ధన్యవాదాలు చెప్పారు. 


Tags:    

Similar News