Master And Jagame Thandhiram : సూర్య బాటలోనే ధనుష్, విజయ్..!

Master And Jagame Thandhiram : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలు ఆగిపోవడం, షూటింగ్

Update: 2020-08-25 07:42 GMT

dhanush, Vijay

Master And Jagame Thandhiram : కరోనా వలన నష్టపోయిన రంగాలలో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలు ఆగిపోవడం, షూటింగ్ దశలో ఉన్న సినిమాలు ఆగిపోవడం, ధియేటర్లు మూతపడిపోవడం వలన సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టం అయితే చూసిందని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే షూటింగ్ లకి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అయితే ధియేటర్లుకి ఇంకా పూర్తి స్థాయిలో అనుమతి రాకపోవడంతో సినిమాలను ఓటీటీ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

అందులో భాగంగానే తమిళ హీరో సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా సూర్య తాజాగా ప్రకటించారు.. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సినిమాని ఇలా రిలీజ్ చేస్తున్నామని అభిమానులు అర్ధం చేసుకోవాలని సూర్య వెల్లడించారు.. అయితే ఇప్పుడు సూర్య బాటలోనే మరికొందరు హీరోలు కూడా తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్', విశాల్ నటించిన 'చక్ర', ధనుష్ నటించిన 'జగమే తందిరం', జయం రవి నటించిన 'భూమి' సినిమాలు త్వరలో ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది. వాస్తవానికి విజయ్ మాస్టర్ సినిమా 2020 ఏప్రిల్ 9 న విడుదల కావాల్సి ఉండగా, జగామే తందిరామ్ 2020 ఆగస్టు 27 న విడుదల కావాల్సి ఉంది.

ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి ఇచ్చిన కేంద్రం కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.. తక్కువ సిబ్బందితో సినిమా, టీవీ షూటింగ్‌లు జరుపుకోవాలని కేంద్రం సూచించింది.

Tags:    

Similar News