మహర్షి కి మహేష్ డబ్బింగ్ షురూ

Update: 2019-02-07 11:35 GMT

వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లో 25వ సినిమా గా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు 3 డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇంకా ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దర్శక నిర్మాతలు డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు. మహేష్ బాబు ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పడంలో నిమగ్నమయ్యాడు. దిల్ రాజు, అశ్వినీ దత్ మరియు పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ ఆఖరి వారంలో విడుదల కానుంది.

Similar News