మరొక సెలెబ్రిటీ కొడుకును హీరోగా లాంచ్ చేయనున్న మైత్రి మూవీ మేకర్స్

Update: 2019-02-18 11:46 GMT

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుంటూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ 'రంగస్థలం' సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేక పోయారు. 'సవ్యసాచి' సినిమా ఫ్లాప్ అయిన తరువాత 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాతో మైత్రి వారికి అనుకోని దెబ్బ దగ్గరైంది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమా లను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే సాయిధరమ్తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.

ఇక కొత్త మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కనున్న సినిమా కూడా మొదలైంది. ఇవి కాకుండా ఇప్పుడు మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టును లైన్ లో పెట్టారు మైత్రి మూవీ మేకర్స్. కీరవాని చిన్న కొడుకు అయినా సింహ కోడూరి ని హీరోగా రితీష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి సంస్థ ఒక సినిమాను నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఈ సినిమాకు 'మత్తు వదలరా' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్లో విడుదలకు సిద్ధం చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

Similar News