బిగ్ బీ అమితాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

Update: 2020-11-03 03:54 GMT

కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ సీజన్‌ 12 తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారం కరమ్‌ వీర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీలను.. 6లక్షల 40వేల రూపాయలకు సంబంధించి బిగ్ బీ.. ఈ ప్రశ్న అడిగాడు. 1927లో బీఆర్‌ అంబేద్కర్‌ అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారన్న ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులో తెలిపాడు. దీంతో బిగ్‌బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Tags:    

Similar News