Kangana Ranaut at Raj Bhavan : మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి కంగనా రనౌత్

Kangana Ranaut at Raj Bhavan : మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కౌశ్యారిని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కలిసింది. తన సోదరి రంగోలితో కలిసి

Update: 2020-09-13 12:12 GMT

Kangana Ranaut 

Kangana Ranaut at Raj Bhavan : మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కౌశ్యారిని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కలిసింది. తన సోదరి రంగోలితో కలిసి గవర్నర్‌తో భేటీ అయిన కంగనా.. తన కార్యాలయాన్ని BMC అధికారులు కూల్చివేయడంపై ఫిర్యాదు చేసింది. అలాగే తనపై ఇటీవల శివసేన నేతలు చేస్తున్న కామెంట్లు, అనంతరం జరిగిన పరిణామాలు, ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి కంగనా తీసుకెళ్లింది. మహారాష్ట్ర గవర్నర్ ని కంగనా కలవడంతో అక్కడి రాజకీయాలు మరింతగా వేడెక్కాయని చెప్పాలి.

ఇంతకి ఎం జరిగింది ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ముంబై పోలీసులు పై, మహారాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ముంబైని పివోకే (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌)తో పోల్చుతూ ఇక్కడ బ్రతకాలంటే భయంగా ఉంది అంటూ కీలక వాఖ్యలు చేసింది. అనంతరం శివసేన పార్టీ నేతలు మే ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తనకి ప్రాణాలకి ముప్పు ఉంది అనగా కేంద్రాన్ని సహాయం కోరగా వై లెవల్ సెక్యూరిటీమో కల్పించింది.

ఇక ఇది ఇలా ఉంటే ఆమె వెకేషన్ నుంచి వచ్చేసరికి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి పాలీహిల్‌లోని కంగన కార్యాలయం అక్రమ కట్టడమని పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. దీనితో కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 

Tags:    

Similar News