మెగా హీరో సినిమాలో తెలుగమ్మాయి

Update: 2019-02-04 07:49 GMT

సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహ విలన్ గా తెరకెక్కిన గ్యాంగ్స్టర్ కామెడీ సినిమా 'జిగర్తాండ' తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో బాబి సింహ పోషించిన పాత్రలో ఇప్పుడు తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ సినిమాను ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ చేశారు. తెలుగులో ఈ సినిమా 'వాల్మీకి' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి ఈషా రెబ్బ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. హీరోయిన్ పాత్ర కోసం హరీష్ శంకర్ ఈషా ను సంప్రదించారని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇక తమిళంలో ఈ సినిమాలో సిద్ధార్ధ్ సరసన లక్ష్మీమీనన్ నటించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో సిద్ధార్థ పాత్రలో ఎవరు కనిపించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.

Similar News