క్రేజీ టైటిల్ తో క్రిష్ కొత్త మూవీ

గతంలో అయన చేసిన సినిమాలలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపించారు క్రిష్. ప్రస్తుతం అయన దర్శకత్వంలో 'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది

Update: 2020-12-03 09:15 GMT

కమర్షియల్ సినిమాలనే చాలా కొత్తగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంటారు దర్శకుడు క్రిష్. గతంలో అయన చేసిన సినిమాలలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపించారు క్రిష్. ప్రస్తుతం అయన దర్శకత్వంలో 'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. లాక్ డౌన్ సమయంలో పక్కా నిబంధనల ప్రకారం కేవలం 45 రోజుల్లో చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూల్ లో క్రిష్ పూర్తిచేశారు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన అవార్డు నవల 'కొండపొలం' ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు క్రిష్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ గిరిజన యువతిగా, డీ- గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారనేది పైన ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా 'కొండపొలం' అనే పేరునే ఖరారు చేసినట్టగా సమాచారం. ఈ కథకు అదే సరైన టైటిల్ అని క్రిష్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన రానుంది.

అటు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ కి 27 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని ఎఎం రత్నం నిర్నిస్తున్నారు. దాదాపుగా 15 రోజుల సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వలన వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్ తిరిగి మొదలుకానుంది.  

Tags:    

Similar News