కామ్రేడ్ కి కత్తెర పడనుందా?

Update: 2019-07-30 07:57 GMT

'డియర్ కామ్రేడ్' విజయ్ దేవరకొండ, రాష్మిక మందన్న నటించిన తాజా చిత్రం. ఈ సినిమాకి ఈ మధ్యనే విడుదలైంది. అయితే, ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ లైన్ బావున్నా కథనం సరిగాలేదంటూ విమర్శకులు విమర్శలు సంధించారు. ముఖ్యంగా రెండో భాగం నిడివి ఎక్కువైందనీ, కనీసం ఓ 20 నిమిషాలన్నా సినిమా నిడివిని తగ్గించవచ్చనీ చాలా మంది తమ రివ్యూలలో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా ఇదే రకమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాని తిరిగి ఎడిట్ చేసే ప్రయత్నాల్లో సినిమా టీం పడిందని తెలుస్తోంది. ఈ వార్తలు ఇప్పటికే వినవస్తున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ వార్తలు నిజమే అనే విషయం ఒకటి తెలిసింది. అది హీరోయిన్ రాష్మిక మందన్న చేసిన ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది. 'డియర్‌ కామ్రేడ్‌ టీం మీకు థియేటర్లో సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీ సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకు మించి నేనేం చెప్పలేను' అంటూ రష్మిక ట్వీట్ చేశారు.

ఇదే కనుక నిజమైతే, సినిమా రీ ఎడిట్ చేసిన తరువాత ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకి ఆంధ్రాలో వసూళ్లు తగ్గిపోయాయనే వార్తల మధ్య ఈ విషయం ప్రాధాన్యతను సంతరించుకోవడమే కాదు.. ఆసక్తిని కలిగిస్తోంది. డియర్ కామ్రేడ్ సినిమాకి బారత్ కమ్మ దర్శకత్వం వహించారు.



Tags:    

Similar News