ఏపీ సీఎం జగన్‌కు మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు తెలుగు సినీఇండస్ట్రీ తరుపున మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2020-05-24 10:44 GMT
Megastar Chiranjeevi, YS Jaganmohan Reddy(file photo)

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు తెలుగు సినీఇండస్ట్రీ తరుపున మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా చిరంజీవి తన ట్వీట్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు కలిగించే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్‌లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందకు తనను కలవమని ఏసీ సీఎం జగన్ తనతో చెప్పినట్టు చిరంజీవి ట్వీట్ చేసారు. త్వరలో చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలకు సంబంధించిన వారితో ఏపీ సీఎం జగన్‌తో చర్చించనునట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.

గత కొన్ని రోజులుగా చిరంజీవి పరిశ్రమకు పెద్ద దిక్కులా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమ తరుపున పేద కళాకారులను, సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న సంగతి తెలిసిందే. ఇటివలే చిరంజీవి తన నివాసంలో టాలీవుడ్‌లో షూటింగ్స్‌కు సంబంధించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చించారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. జూన్ నుంచి షూటింగ్స్‌‌కు అనుమతులు ఇచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటేనే పర్మిషన్ ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.




 


Tags:    

Similar News