వివాదాలు.. అల్లర్లు.. కేసులు.. అన్నిటి మధ్య బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కొద్ది నిముషాల్లో మా టీవీలో ప్రసారం కాబోతోంది. ఈ షో విషయంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. మొదట హోస్ట్ ఎవరనేది తేల్చుకోవడానికే చాలా కాలం పట్టింది. ఎందర్నో అనుకుని.. ఆఖరుకు నాగార్జున దగ్గర ఆగారు. ఇక పార్తిసిపెంట్ల విషయంలో ఎంతో గందరగోళం చోటు చేసుకుంది. పార్టిసిపెంట్లు ఎంపిక వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ విషయం కోర్టుకు కూడా చేరింది. కొందరు బిగ్ బాస్ షో పై ఆరోపణలు చేస్తూ దిల్లీ లోనూ ఆందోళనలు చేశారు. ఈ నేపధ్యంలో బిగ్ బస్ వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ. అనుకున్నట్టుగానే షో ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోతోంది.
ఇక పార్టిసిపెంట్ల విషయంలో.. ఎంతమంది పేరులో తెర మీదకు వచ్చాయి. చివరకు ఈ 15 మంది పేర్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. వారు వీరే..
''తీన్మార్ సావిత్రి, జర్నలిస్టు జాఫర్, యాంకర్ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్ సందేశ్, అతడి భార్య వితికా షేరు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్స్మాష్ స్టార్), రఘు మాస్టర్, ఫన్ బకెట్ మహేష్ విట్టా, అలీ రెజా, రవికృష్ణ"
మరి వీరిలో నిజంగా ఎంతమంది ఉంటారో.. వీరు కాకుండా ఇంకా కొందరు ఉన్నారేమో కొద్ది నిముషాల్లో తేలనుంది.