Samantha: మూడు యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

Samantha: అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల అంశంపై రెచ్చిపోయిన పలు యూట్యూబ్‌ ఛానళ్లపై హీరోయిన్‌ సమంత మండిపడింది.

Update: 2021-10-20 10:22 GMT

Samantha: మూడు యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

Samantha: అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల అంశంపై రెచ్చిపోయిన పలు యూట్యూబ్‌ ఛానళ్లపై హీరోయిన్‌ సమంత మండిపడింది. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై పరువు నష్టం దావా దాఖలు చేసింది. కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సామ్.. వెంకట్రావు అనే అడ్వొకేట్‌పై కూడా పిల్‌ దాఖలు చేసింది. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరింది. ఈ రోజు సాయంత్రం సమంత తరఫు న్యాయవాది తమ వాదన వినిపించనున్నారు. నాగ చైతన్యతో వివాహ బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

Full View


Tags:    

Similar News