హీరో అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు!

Complaint On Allu Arjun : కరోనా నిబధనలను ఉల్లంఘించారని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై సమాచార హక్కు సాధన స్రవంతి

Update: 2020-09-17 05:42 GMT

Allu Arjun

Complaint On Allu Arjun : కరోనా నిబధనలను ఉల్లంఘించారని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారు. అయితే బన్నీతో పాటుగా పుష్ప టీం జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే విషయమై ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. అటు బన్నీ తన కుటుంబ సభ్యులతో పాటుగా స్నేహితులతో కుంటాల జలపాతాన్నీ సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. అంతేకాకుండా అక్కడ ఆయన అభిమానుల్ని పలకరిస్తూ ఓపెన్ టాప్ జీపులో కూడా ప్రయాణించారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం..

Tags:    

Similar News