ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-21 00:56 GMT
Live Updates - Page 2
2020-05-21 06:42 GMT

నూజివీడు ఆర్టీసీ డిపో నుండి ప్రారంభమైన బస్ సర్వీసులు

* కృష్ణాజిల్లా నూజివీడు ఆర్టిసి డిపో నుండి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం,  మైలవరం రూట్లలో 16 బస్ సర్వీసులు

* నూజివీడు నుండి విజయవాడ-6, మచిలీపట్నం కు 2, గుడివాడకు 4, మైలవరం 3కు, ముసునూరు1 మొదలయ్యాయి.

* మాస్కులు ధరించి, శానీటైజర్లు తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే ప్రయాణికులను బస్సు ఎక్కిస్తున్న డ్రైవర్లు.

2020-05-21 06:41 GMT

నెల్లూరు మునిసిపల్ కమిషనర్ గా IAS అధికారి స్వప్నిల్ దినకర్ బదిలీ రద్దయింది.

2020-05-21 06:22 GMT

-కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో ధాన్యం లారీ బోల్తా

-నిజాంసాగర్ నుంచి కామారెడ్డి కి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ

-ప్రమాద వశాత్తు బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలు

2020-05-21 06:22 GMT

-ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలు.

-సోమాజి గూడ లోని రాజీవ్ గాంది విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్.

-పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంత రావు, గూడూరు నారాయణ రెడ్డి ,బొల్లు కిషన్ తదితరులు....

-పోలిసు బందోబస్తు మద్య నివాళులర్పించిన నేతలు

2020-05-21 05:44 GMT

ఏపీలో విద్యుత్ బిల్లుల అంశంపై హైకోర్టులో విచారణ

3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.

2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు లాయర్

ఏబీసీ టారిఫ్ యూనిట్లలో మార్పులు చేశారన్న పిటిషనర్ తరపు లాయర్

కొత్త నిబంధనలు ఏప్రిల్1 నుంచి రావాలన్న పిటిషనర్ తరపు లాయర్..

2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం స్లాబు మారి బిల్లులు పెరిగాయని వాదనలు

2020-05-21 03:35 GMT

- నల్గొండ జిల్లాలో చిట్యాల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

- ఆగి వున్న లారీ.. డీ కొన్న కారు.

- ముగ్గురు మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.

- తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాదు వస్తుండగా జరిగిన ప్రమాదం.

2020-05-21 03:35 GMT

సింగరేణిలో పనులు షురూ..

సింగరేణిలో విధించిన కోవిడ్ 19 లే ఆఫ్ ను ఎత్తి వేయడంతో భూపాలపల్లి ఏరియాలో 50 రోజుల అనంతరం పునఃప్రారంభమైన 4 భూగర్భ గనులు, అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరవుతున్న కార్మికులు

2020-05-21 01:35 GMT

కేంద్ర పన్నులలో మే నెల రాష్ట్రాల వాటాను ప్రకటించిన కేంద్రం

– రాష్ట్రాల మే నెల విడత నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం

– మొత్తం రూ.46,038.70 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

– ఆంధ్రప్రదేశ్‌కు రూ.1892.64 కోట్లు నిధులు కేటాయింపు

– తెలంగాణ రాష్ట్రానికి రూ.982 కోట్ల నిధుల కేటాయింపు

2020-05-21 01:31 GMT

- విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తూ బాలిక మృతి 

- విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం గొందిమెలక గ్రామానికి చెందిన వంతాల చిన్నారి (12) 

- బట్టలు ఉతికేందుకు గెడ్డకు వెళ్ళిన చిన్నారి.

- ప్రమాదవశాత్తు కాలుజారీ గెడ్డల్లో పడి మృతి.


2020-05-21 01:28 GMT

ఏపీలో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు

- ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

- రెండు నెలలుగా దిపోలకే పరిమితమైన బస్సులు 

- మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు ఈరోజు నుంచి తిరగనున్నాయి.

- 17 శాతం బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేసిన అధికారులు 

- ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమె ప్రయాణానికి అనుమతిస్తున్నారు. 



Tags:    

Similar News