Live Updates:ఈరోజు (జూన్-22) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-22 00:35 GMT
Live Updates - Page 2
2020-06-22 01:17 GMT

గవరపాలెంలో నిబంధనలు సడలింపులు

- అనకాపల్లి మండలం గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ ఎత్తేస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ బీవీ.సత్యవతి స్పష్టం చేశారు.

- ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​తో కలిసి ఆమె... గవరపాలెంలో పర్యటించార.

- ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కావటంతో గత 16 రోజులుగా కంటైన్మెంట్ జోన్​ ఏర్పాటు చేశామన్నారు.

- కరోనా బాధితులు కోలుకొని డిశార్జ్ కావటంతో సడలింపులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

- వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

- అనంతరం అనకాపల్లి ప్రధాన రహదారిలోని దుకాణాలు తెరుచుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.

2020-06-22 01:09 GMT

కొబ్బరి కాయల లోడులో 664 కేజీల గంజాయి పట్టివేత

-  కాయల లోడులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు.

- వీరు తుని నుంచి బీహార్​ రాష్ట్రానికి కొబ్బరి కాయలను లారీలో తరలిస్తుండగా... వేంపాడు టోల్​ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.

- లారీతో పాటు డ్రైవర్​, క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నారు.

- వీరి వద్ద నుంచి 664 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

-  విలువ సుమారు 13.28 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. 




Tags:    

Similar News