Live Updates:ఈరోజు (జూలై-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-05 01:54 GMT
Live Updates - Page 2
2020-07-05 03:20 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం

అమరావతి :

- ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సోమవారం జమ కానున్నాయి.

- 2వ తేదీనే గవర్నర్‌ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ శనివారం వరకు ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.

- గవర్నర్‌ ఆమోదం పొందిన రోజే బడ్జెట్‌ అమల్లోకి వస్తున్నట్లు ఆర్థికశాఖ జీవో ఇచ్చింది.

- పూర్తి వివరాలు  

2020-07-05 03:17 GMT

నేడు రేపూ వర్షాలు

అమరావతి :

- ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

- ఏపీ  తీరప్రాంతానికి, దక్షిణ ఒడిసా తీరానికి పశ్చిమ దిశగా ఆవర్తనం నెలకొంది.

- ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది.

- ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

-  పూర్తి వివరాలు 

2020-07-05 03:14 GMT

విజయవాడ: అక్రమంగా మద్యం తరలిస్తున్న వాలెంటర్ అరెస్ట్.

- నున్న సచివాలయంలో వాలెంటర్ భూక్య జోసెఫ్ గా గుర్తించిన పోలీసులు.

- శనివారం అర్ధరాత్రి మద్యాన్ని ఆటోలో తరలిస్తూ పట్టుబడ్డ వైనం.

- అతని నుండి 180 బాటిల్స్ స్వాధీనం చేసుకున్న నున్న సిఐ ప్రభాకర్ సిబ్బంది.

Tags:    

Similar News