Live Updates:ఈరోజు (జూలై-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-04 01:30 GMT
Live Updates - Page 2
2020-07-04 03:41 GMT

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు.

- విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నాను. శ్రీవారిని ప్రార్దించానని తెలిపారు.

- ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారు.

- అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు.

- త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు.



2020-07-04 03:38 GMT

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు

- కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం. కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారు.

- ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదు.

- ప్రతిపక్షాలను ఇంతగా టార్గెట్ చేయలేదు. ఇంతమంది నాయకులను జైళ్లకు పంపలేదు.

- బీసిలంటేనే వైసిపి పగబట్టింది. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.

- ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతిఒక్కరూ ఖండించాలి. 

2020-07-04 03:36 GMT

కృష్ణాజిల్లా: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర గూడూరు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు.

- మంత్రి పేర్నినాని సన్నిహితుడు భాస్కరరావు హత్య కేసులో నిన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారన్న ఉత్కంఠ నెలకొంది.

- ప్రస్తుతం కొల్లు రవీంద్ర గూడూరు పీఎస్‌లో ఉన్నారు.

- కాసేపట్లో ప్రభుత్వాస్పత్రిలో‌‌ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

- వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

- ఇదిలా ఉంటే ఉదయం 11 గంటలకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- భాస్కరరావు హత్య కేసులో కొల్లు ప్రమేయంపై జిల్లా ఎస్పీ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.



Tags:    

Similar News