Live Updates: ఈరోజు (ఆగస్ట్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-30 00:37 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 30 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ద్వాదశి (ఉ. 9-05 వరకు) తదుపరి త్రయోదశి, ఉత్తరాషాఢ నక్షత్రం (మ. 3-32 వరకు) తదుపరి శ్రవణ, అమృత ఘడియలు (ఉ. 9-05 నుంచి 10-42 వరకు తిరిగి తె. 5-19 నుండి) వర్జ్యం (రాత్రి 7-35 నుంచి 9-12 వరకు) దుర్ముహూర్తం (సా. 4-34 నుంచి 5-24 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-14

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-08-30 08:22 GMT

అమరావతి..

-జోగి రమేష్....వైసీపీ ఎమ్మెల్యే..

-ప్రభుత్వం పై చంద్రబాబు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

-చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఫలితం లేదు.

-సివిల్ servents ల పైన కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

-కష్టపడి పని చేస్తున్న కలెక్టర్ల పై విషం చిమ్ముతున్నారు.

-ప్రభుత్వం,ysr కాంగ్రెస్ పార్ట్ ని చంద్రబాబు ఎం చేయలేకపోయారు.

-అధికారులు పై పడి హాని ప్రయోగం అంటూ తప్పుడు మాటలు మాట్లాడ్తున్నారు.

-ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు పై కేసులు పెట్టాలి.

-చంద్రబాబు నికృష్టమైన పనులు చేస్తున్నారు,జైల్ కి పంపించాలి

2020-08-30 05:26 GMT

అమరావతి...

-ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..

-ఏడాదిలోనే ఎవరూ వూహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన.

-అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి రూ.41,718కోట్లు లభ్ది.

-90% హామీలు అమలు.

-ఏడాది పాలనపై ప్రజల వద్దకు మేనిఫెస్టో,ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌.

-మేనిఫెస్టోను మాయంచేసిన బాబెక్కడ? ప్రజలకే తన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అడుగుతున్న జగన్ గారెక్కడ?

2020-08-30 05:23 GMT

శ్రీకాకుళం జిల్లా..

-నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్న వైనం..

-కంటైన్మెంట్ జోన్లలో నుంచి బయటకు వస్తున్న ప్రజలు..

-చెక్ పాయింట్లు పెట్టి కట్టడి చేస్తున్న పోలీసులు..

-పోలీసులను తప్పించుకుని మారు మార్గాల్లో సంచరిస్తున్న నగర వాసులు..

2020-08-30 05:19 GMT

తూర్పుగోదావరి జిల్లా...... చింతూరు...

-చింతూరు మండలం మోతుగుడెం వద్ద భారీగా గంజాయి పట్టివేత..

-కోటి రూపాయల విలువ గల గంజాయి, 4 లక్షల 25 వేలు నగదు స్వాధీనం

-ఆరుగురు వ్యక్తులు అరెస్టు.. వ్యాను, కారూ సీజ్ చేసిన పోలీసులు

2020-08-30 05:16 GMT

తూర్పుగోదావరి....

-కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ..

-వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

-అందువలన 14 రోజులపాటు నియోజకవర్గంలోనాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు నేరుగా అందుబాటులో ఉండనని మెసేజ్ లో విజ్ఞప్తి చేసిన       ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

-గోదావరి వరదల వలన నష్టపోయిన రైతులకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముంపుప్రాంతాలలో జిల్లా మంత్రులు, అధికారులతో కలిసి    విస్తృత పర్యటనలు

-ఈ పర్యటనల అనంతరం అస్వస్థతకు గురవ్వడంతో కోవిడ్ పరీక్షలు చేయిచుకోగా పాజిటివ్ నిర్థారణ అయింది

-వై.యస్.ఆర్.సి.పి.జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి

2020-08-30 04:27 GMT

విజయవాడ....

-ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ సీఐడీ విచారణ నేడు

-వైద్యులపై ఏపీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందంటున్న డాక్టర్ గంగాధర్

-కరోనా భయానక పరిస్ధితులలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సలహా ఇచ్చినందుకు డాక్టర్లపై చర్యలా - డాక్టర్ గంగాధర్

-పీపీఈ కిట్లు, మాస్కులు, కోవిడ్ ఎక్విప్మెంట్ లేవని అన్నందుకు కేసులు పెట్టడం అమానుషం - డాక్టర్ గంగాధర్

-కోవిడ్ కేర్ లో లోపాలు ఉన్నాయన్నందుకు కేసులు పెట్టారు - డాక్టర్ గంగాధర్

2020-08-30 04:23 GMT

అమరావతి..

-టిడిపి నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన్ చేసి పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

-అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న లోకేష్.

-త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లోకేష్

-కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పై పోరాటం కొనసాగిస్తా అని లోకేష్ తో అన్న అచ్చెన్నాయుడు

2020-08-30 04:20 GMT

తూర్పుగోదావరి..

-ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్లను ఎత్తివుంచిన అధికారులు

-2లక్షల 71 వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

-ప్రస్తుతం వరద నీటిమట్టం 6.40 అడుగుల నీటిమట్టం

-ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో పది లక్షల క్యూసెక్కుల వరకూ మళ్ళీ వరద పెరిగే అవకాశం

2020-08-30 04:16 GMT

అమరావతి..

-టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడికి చంద్రబాబు పరామర్శ.

-అచ్చెన్నకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు.

-అచ్చెన్నాయుడు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు.

-త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.

2020-08-30 03:32 GMT

కర్నూలు జిల్లా..

-శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

-ప్రధాన న్యాయమూర్తిని ఘనంగా ఆహ్వానం పలికిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా జడ్జిలు, ఆలయ కార్యనిర్వహణాధికారి ks రామారావు

-స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చనాది పూజలు నిర్వహణ

Tags:    

Similar News