Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-21 01:17 GMT
Live Updates - Page 2
2020-09-21 10:28 GMT

Amaravati updates: పోలీస్‌ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్‌..

అమరావతి..

సీఎం పాయింట్స్..

-పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌)‌‌యాప్‌ను     ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

-పోలీసు ఫీల్డ్‌ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లు అందజేసిన సీఎం.

-పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది.

-సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం   లేదు.

-మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ పొందవచ్చు.

-మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు.

--పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

-దేశంలోనే తొలిసారిగా దిశ యాప్‌. ఇది ఎంతో సక్సెస్‌ అయింది. 11 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇది గర్వకారణం

-దిశ యాప్‌ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 యఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము.

-సైబర్‌ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్‌ నంబరు ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం.

స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీ.

-రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చి రిమోట్‌ ఏరియా కమ్యూనికేషన్లు, వాహనాలకు జీపీఎస్, శాటిలైట్‌ ఫోన్ల వ్యవస్థ ఏర్పాటు చేశాం.

-న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలోనే ‘ఇంటర్‌- ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌’.

-ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.

-చాలా సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారా పొందవచ్చు.

2020-09-21 10:19 GMT

Visakha updates: సింహాచలం లో భక్తులకు ఇవాళ నుండి ప్రత్యక్ష పద్దతిలో పూజల్లో పాల్గొనే అవకాశం..

విశాఖ..

-కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అనుమతి

-ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి అనుమతి

2020-09-21 10:13 GMT

AP Congress Core Committee Meeting: ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరభవన్ లో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..

ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..

-హజరుకానున్న మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంచార్జీ ఉమించాంది , ఏపీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ , ఇతర పార్టీ సీనియర్ నేతల.

-చాలా రోజుల తరువాత పార్టీ మీటింగ్ కి హాజరవుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.











2020-09-21 10:08 GMT

Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..

తూర్పుగోదావరి -రాజమండ్రి..

ఏపీ కాపు జేఏసీ నేతలు మీడియా సమావేశం

రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ , ఆరేటి ప్రకాష్, చినిమిల్లి రాయుడు కామెంట్స్ ,,

-ముద్రగడ నాయకత్వంలో ఐదేళ్ళు ఉద్యమం చేశాం

-లేఖరూపంలో ముద్రగడ తన నిర్ణయం తెలిపారు

-ముద్రగడ మనస్తాపం చెందివున్నారు

-ఎమ్మెల్యే పదవికి రాజీనామా , జీవో 30 తేవడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఐదు శాతం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపడం ముద్రగడ ఉద్యమం వల్లే

-కాపులు ఎపుడూ ముద్రగడ ను మరచిపోరు

-రిజర్వేషన్లు ఫలితాలు సాధన, సంక్షేమంపై ఆయన పాత్ర లేనిదే మేము లేం

-ఏదిఏమైనా ముద్రగడ బాటలోనే నడుస్తాం

-ప్రతిజిల్లాలో కాపు జేఏసీ సమావేశాలు నిర్వహించి మళ్ళీ ముద్రగడ ను కలుస్తాం..కాపు రిజర్వేషన్లు సాధించితీరతాం

-ముద్రగడ పద్మనాభం మనస్థాపం చెంది ఆయనను బుజ్జగింపుపైనే దృష్టి పెట్టాం

-ముద్రగడ కు అండగా వున్నామని చెప్పడానికే ఈ సమావేశం ప్రాధాన్యం

2020-09-21 10:00 GMT

National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..

జాతీయం..

-కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి అనిల్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలు

-పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని వినతి

అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి..

- రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు

- వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు

- 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం

- పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలి

- నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు విడుదల చేస్తామన్నారు

- కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించాను

- అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు

- ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు

2020-09-21 08:57 GMT

Guntur updates: గుంటూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి....అగ్రికల్చర్ జేడీ విజయభారతి....

గుంటూరు...

-హెచ్ఎంటివి తో గుంటూరు అగ్రికల్చర్ జేడీ విజయభారతి....

-జిల్లాలో ప్రత్తి,మిరప,వరి,పసుపు పంటలు నష్టపోయాయి...

-జిల్లాలో 9,600హెక్టార్లలో పంటలు నష్టపోయాయి.....

-వాగులు పొంగిపొర్లడంతో పంటలకు నష్టం జరిగింది....

-రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది....

2020-09-21 08:47 GMT

East Godavari updates: రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ లో ఆందోళన చేపట్టిన బిజెపి యువమోర్చా సభ్యులు..

తూర్పు గోదావరిజిల్లా.... రాజోలు..

-హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని బర్తరఫ్ చేయాలంటూ ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన   యువ మోర్చా సభ్యులు.

-మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డా బీజేపీ యువ మోర్చా సభ్యులు.

-150 కేజీల బరువున్న నాని ఒంట్లో నుంచి రెండు కేజీలు తీసేస్తే వాడికి ఏమైనా నష్టమా అంటూ మండిపడ్డారు

-ఆందోళన చేస్తున్న యువ మోర్చా సభ్యులను అడ్డుకున్న పోలీసులు.

2020-09-21 08:27 GMT

East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

తూర్పుగోదావరి..

-అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయం లో

-ఈనెల 25 వరకు భక్తులకు మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

-కరోనా వ్యాప్తి నివారణ, పోలీసు బందోబస్తు నేపధ్యంలో తాజా నిర్ణయం తీసుకున్న అధికారులు

-ఉదయాన్నే దర్శనాలకు అనుమతించినా ఆలయానికి రాని భక్తులు

2020-09-21 07:11 GMT

Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..

అమరావతి...

-సోము వీర్రాజు...ఏపీ బీజేపీ అధ్యక్షుడు..

-ఇదే ఉద్దేశం తో రైతుల బిల్ ప్రవేశ పెట్టాము..

-భారత దేశం లో రైతు పండించే పంట కు గిట్టుబాటు ధర లేదు..

-రైతు కూడా తన పంట ఎక్కడైనా అమ్ముకోవాలి...

-ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదు.

-ఇప్పటివరకు దేశంలో దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోయారు.

-మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం లేదంటున్నారు.

-ఏంటి..ఈ భాష, ఇది సభ్యత కాదు.

-ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాష మాట్లాడించడం మంచిది కాదు...

-బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

-సరైన భాష మాట్లాడడానికి కూడా చట్టబద్ధత ఉండాలి....

2020-09-21 07:01 GMT

Amaravati updates: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక-కె.కన్నబాబు..

పిడుగు హెచ్చరిక..

కృష్ణా జిల్లా..

*కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్*

-నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం.

తూర్పుగోదావరి జిల్లా..

-రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం

-మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

-పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

-సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

Tags:    

Similar News