Live Updates: ఈరోజు (సెప్టెంబర్-20) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-20 03:02 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 20 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ: ఉ.10-07 వరకు తదుపరి చవితి | చిత్త నక్షత్రం ఉ.6-20 వరకు స్వాతినక్షత్రం తె.4-41వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: ఉ.11-32 నుంచి 1-01 వరకు | అమృత ఘడియలు: రా.8-28 నుంచి 9-58 వరకు | దుర్ముహూర్తం: సా.4-20 నుంచి 5-08 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-20 09:19 GMT

విశాఖ..

-మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్..

-ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పశువులను కొన్నట్టు శాసన సభ్యులను కొన్నారు అని విమర్శించిన జగన్, ఇప్పుడు ఏం మాట్లాడతారు.

-దేశంలో అత్యధిక కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులు జాబితాలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు.

-న్యాయ స్థానాలు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

-ఎంత మంది శాసన సభ్యులను తీసుకెళ్లిన టిడిపి భయపడదు.

-వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో వ్యవసాయ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తున్నారు.

-కేసులకు భయపడి కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు..

2020-09-20 09:14 GMT

-విజయవాడ..

-సముద్రంలోకి 4,44,640 క్యూసెక్కుల నీటి విడుదల

-కాలువలకు 4,328 క్యూసెక్కుల నీటి విడుదల

-మొత్తం ఇన్ ఫ్లో 4,48,968 క్యూసెక్కులు

-ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక

-పులిచింతల వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

-లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

-బోట్లు, మర బోట్లు, స్పీడ్ బోట్లు తిరగరాదన్న కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్

2020-09-20 06:08 GMT

కర్నూలు జిల్లా......

-తేలికపాటి వర్షం కురుస్తుంది..

-సంజామల మండలం లో ముదిగేడు వద్ద పాలేరు వాగు వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు నిలిచిపోయిన రాకపోకలు ...

-జలదిగ్బంధంలోనే ఓత్రమాన్ దీన్నే , వల్లం పాడు , చిన్న కొప్పెర్ల , పెద్ద కొప్పెర్ల , లింగాల గ్రామాలు ....

-కానాల చెరువు కు పడ్డ గండి ని పూడ్చే ప్రయత్నంలో ఇరిగేషన్ అధికారులు.....

2020-09-20 06:03 GMT

కడప :

-జిఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా 10వేల క్యూసెక్కులు, పరివాహాక ప్రాంతంలొ కురిసిన వర్షాల వల్ల మరొ 16 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్న ప్రవాహాం

-మైలవరం ప్రాజెక్టుకు 23వేలు, జిఎస్ఎస్ఎస్ కాలువకు 400, గండికొట లిప్ట్ 990క్యూసెక్కులు విడుదల

-గండికొటలొ 13.400టిఎంసీలకు చేరిన నీటి నిల్వ

2020-09-20 04:11 GMT

తూర్పుగోదావరి -రాజమండ్రి..

-1388 పోస్టులకు గాను 1,06,449 మంది అభ్యర్థులు పోటీ

-వీరిలో 1,877 మంది దివ్యాంగ అభ్యర్ధులు

-కాకినాడ – 166, రాజమహేంద్రవరం-106, అమలాపురం-64 మొత్తం 336 పరీక్షా కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..

2020-09-20 04:07 GMT

నెల్లూరు:-

- జిల్లా వ్యాప్తంగా 1556 పోస్టుల కోసం 138 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం సచివాలయ పరీక్షలు.

- కరోనా సోకిన వారికి సైతం ప్రత్యేక ఏర్పాట్లు.

2020-09-20 04:03 GMT

విశాఖ...

-1585 పోస్టులకు గాను 1,50,441 మంది అభ్యర్థులు..

-తొలిరోజు 95 వేల మంది హజరు..

-277 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..

2020-09-20 04:01 GMT

తూర్పుగోదావరి :

-జిల్లాలో 1388 ఉద్యోగాలకు.. దరఖాస్తు చేసి 1,06,449 మంది అభ్యర్ధులు..

-వీరిలో 1817 మంది దివ్యాంగులు.. జిల్లా వ్యాప్తంగా 336 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.

-సచివాలయం పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 176 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సేవలు..

-కరోనా నేపధ్యంలో రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటరుకు చేరుకుంటున్న అభ్యర్ధులు..

-ప్రతి అభ్యర్ధి మాస్క్, హ్యాండ్ గ్లౌవ్స్, శానిటైజర్ తప్పనిసరి.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ధర్మల్ స్కానింగ్ పరీక్షలు..

-కరోనా లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు..

-ప్రతీ పరీక్షకు ముందు.. ఎగ్జామ్ హల్ ను హైపోక్లోరైడ్ సొల్యుషన్ తో శుభ్రం చేసిన సిబ్బంది..

2020-09-20 03:45 GMT

విశాఖ...

-24 గంటల్లో బలపడే అవకాశం..

-తెలంగాణ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనాలు..

-వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

-తీరం వెంబడి గంట కు 45-50 కీ మీ వేగం తో గాలులు

-మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు..

2020-09-20 03:35 GMT

అమరావతి

- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ప్రారంభం

- ఈరోజు ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం 6.81 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

- ఉదయం రాసే వారి కోసం 2221 కేంద్రాలు, మధ్యాహ్నం పరీక్ష రాసే వారి కోసం 1068 కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు

- పరీక్షల నిర్వహణ కోసం 77,558 మంది సిబ్బందిని వినియోగo.

- ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నాపత్రాలు ఉంచడానికి 13 జిల్లాల కేంద్రాల్లో స్ట్రాంగ్‌రూములు ఏర్పాటు

Tags:    

Similar News