Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-14 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-14 09:00 GMT

రంగారెడ్డి , రాజేంద్రనగర్...

-చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగి కిందకు వెళ్తున్న వరద..

-ఏ క్షణమైనా పూర్తిస్థాయిలో చెరువు కట్ట ధ్వంసమయ్యే అవకాశం...

-తీవ్ర భయాందోళన లో లోతట్టు ప్రాంతాల ప్రజలు

-అల్ జుబేల్ కాలనీ , అలీ నగర్ , గాజీ మిలన్ కాలనీ , నింరా కాలనీ , ఉప్పుగూడా , లలితా బాగ్ లోని లోతట్టు ప్రాంతాలు నీట్ మునిగే అవకాశం...

-అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..

-సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ , మున్సిపల్ , పోలీస్ అధికారులు...

2020-10-14 08:56 GMT

రంగారెడ్డిజిల్లా...

-అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని లష్కర్ గూడ వాగు లో కొట్టుకుపోయిన కారు ఘటనలో మాధారం వెంకటేష్ గౌడ్

-మృతదేహం 3 కిలోమీటర్ల దూరం లో లభ్యం

-గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు

-ఇంకో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు

-ఆందోళన లో కుటుంబ సభ్యులు

2020-10-14 08:52 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ....

-పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.

-ప్రస్తుత నీటిమట్టం :8.19 టీఎంసీలు .

-పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .

-ప్రస్తుత నీటి మట్టం : 406.30అడుగులు .

-ఇన్ ఫ్లో...:6000 క్యూసెక్కులు

-అవుట్ ఫ్లో..: 6000. క్యూసెక్కులు

-(2)గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నా అధికారులు ....

-దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

2020-10-14 08:44 GMT

హైదరాబాద్..

పాతబస్తీ..

-జంట నగరాలతో పాటు పాతబస్తీలో వరద ఉధృతి పరిస్థితులను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్..

-ఫలక్నామా, చంద్రయన గుట్ట ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న 15 మందిని కాపాడాము..

-లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ టీమ్, జిహెచ్ఎంసి పోలీసులు సంయుక్తంగా కలిసి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.

-ప్రజలు భయాందోళనకు గురి అవల్సిన అవసరం లేదు.

-పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నలు కొనసాగుతున్నాయి

2020-10-14 08:40 GMT

-హైదరాబాద్‌-కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారు..

-ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

-మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌకి ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు.

-దీనికి బదులు సెవెన్‌ టోంబ్స్‌ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను పోలీసులు కోరారు.

-పురానాపూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇక్కడి నుంచే వెళ్లే వాహనాలను కార్వాన్‌ నుంచి మళ్లిస్తున్నారు.

-మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది.

-దీంతో ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

-మూసీ ఉప్పొంగడంతో మూసారాం బాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ బ్లాక్‌ అయ్యింది.

-ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు.

-మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు

2020-10-14 08:36 GMT

-రికార్డు స్థాయిలో మూసీ ప్రాజెక్టు కు వరద నీరు ...దాదాపు రెండు లక్షల ఇన్ ఫ్లో ...

-మూసీ ప్రాజెక్టు సామర్ధ్యానికి మించి ఇన్ ఫ్లో...

-అన్ని గేట్లు ఓపెన్ చేసిన కష్టంగా అవుట్ ఫ్లో ...

-మూసీ ప్రాజెక్టు చెరువనా రత్నపురం వద్ద మూసీ ఆనకట్టకు గండి కొట్టిన అధికారులు...

-హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి ,మేడ్చల్ ,యాదాద్రి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు...

-ఎగవన భారీ వర్షాలతో మూసీ నది లోకి భారీగా వస్తున్న వరద నీరు..

-మూసీ నది ఉధృతి తో ...బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట , నార్కెట్‌పల్లి మండలాల్లో వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు...

2020-10-14 08:32 GMT

సూర్యాపేట జిల్లా :

-హుజూర్ నగర్ మండలం లింగగిరి నూతన బ్రిడ్జి నిర్మాణం లో ఉండగా తాత్కాలిక బ్రిడ్జి పై నుండి భారీగా ప్రవహిస్తున్న వరద నీరు హుజూర్నగర్ లింగగిరి రాకపోకలు అంతరాయం...

-గరిడేపల్లి, హుజూర్ నగర్ మండలం లో నీట మునిగిన పంట పొలాలు...

2020-10-14 08:28 GMT

-చందానగర్ లో సెల్లార్ వరకు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

-సహాయం కోసం కాలనీవాసుల ఆర్తనాదాలు...

-కింద ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోవడంతో టెర్రస్ పైకి ఎక్కిన కాలనీ వాసులు..

-జిహెచ్ఎంసి బృందానికి టోల్ ఫ్రీ నెంబర్లు కి కాల్ చేసిన పట్టించుకునే నాధుడు లేడు అని స్థానికులు ఆవేదన...

2020-10-14 07:01 GMT

-శాసనమండలి సమావేశాల నుండి నేరుగా సూర్యాపేట కు బయలుదేరిన మంత్రి జగదీష్ రెడ్డి..

-రత్నపురం వద్ద గండి కొట్టడంతో టేకుమట్ల వద్ద రోడ్డు పైకి ప్రవహిస్తున్న నీళ్లు..

-ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశం..

-దిగువన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

2020-10-14 06:57 GMT

-శాసనమండలిలో జిహెచ్ఎంసి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.

-సవరణలు మండలిలో ప్రతిపాదించిన కేటీఆర్.

-ఎంఎస్ ప్రభాకర్ రావు ప్రభుత్వ విప్..

-ప్రభుత్వం ప్రవేశపెట్టిన ghmc సవరణ బిల్లు చాలా బాగుంది.

-మహిళలకు ఈ బిల్లు ద్వారా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.

-నగరంలో మంచి అభివృద్ధి జరిగింది.

-భారీ వర్షాలతో చాలాచోట్ల ఇబ్బంది పడ్డా ....గతంలో తీసుకున్న చర్యలతో పరిస్థితి కాస్తా మెరుగుపడ్డది.

-ఈ సవరణ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము.

Tags:    

Similar News