Live Updates: ఈరోజు (13 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-13 01:13 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 13 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి ఉ.09-59 వరకు తదుపరి ద్వాదశి | మఘ నక్షత్రం రా.07-59 వరకు తదుపరి పుబ్బ | వర్జ్యం: ఉ.08-22 నుంచి 09-56 వరకు | అమృత ఘడియలు సా.05-40 నుంచి 06-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి మ.10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: ఉ.03-30 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-13 08:52 GMT

అమరావతి..

-గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డిజి గా అర్ కే మీనా

-ఏసీబీ డైరెక్టర్ శంఖా బ్రత బాగ్చి బదిలీ, ఏపీఎస్పి బెటాలియన్ ఐజీ గా నియామకం

-గుంటూరు రేంజ్ డిఐజీ గా త్రివిక్రమ్ వర్మా

-ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ కుమార్ బదిలీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గా నియామకం

-విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి

2020-10-13 08:50 GMT

పశ్చిమ గోదావరి జిల్లా....

-నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏలూరులో నీటమునిగిన ఆర్టీసీ డిపో

-ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కండక్టర్స్ రెస్ట్ రూమ్స్ లో చేరుకున్న వరద నీరు

-నగరంలో పలు రోడ్లు జలమయం

2020-10-13 08:45 GMT

తూర్పుగోదావరి... కొత్తపేట..

-ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుపతి గా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రాత్రి వర్షానికి ఆఁలయ ప్రాంగణం మునక.

-ఈరోజు దర్శనాలు రద్దు

-మోటార్లతో నీటిని బయటకు

-పంపుతున్న సిబ్బంది

2020-10-13 08:40 GMT

పశ్చిమ గోదావరి జిల్లా..

-నిడదవోలు లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే స్టేషన్ అంతా జలమయమైంది.

-రైల్వే ట్రాక్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆ ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైళ్లు, పాసింజర్ రైళ్లు, అధికారులు ఎంతో అప్రమత్తంగా నడుపుతున్నారు.

2020-10-13 08:36 GMT

కర్నూలు...

-కర్నూలు పార్లమెంట్ టీ.డీ.పీ అధ్యక్షులు..

-సోమిశెట్టి వెంకటేశ్వర్లు..

-ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ తుంగభద్ర పుష్కరాలపై సమీక్ష కూడా నిర్వహించలేదు...

-మంత్రి జిల్లా కు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియడం లేదు...

-తుంగభద్ర పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..

2020-10-13 08:29 GMT

కర్నూలు జిల్లా ....

-తలకు బలమైన గాయాలు తగలడంతో కోయిలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

2020-10-13 08:27 GMT

కర్నూలు..

-మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాల పై సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు.. రౌండ్ టేబుల్ సమావేశం.

-ఇట్టినా ప్లాంటేషన్ ఈ కంపెనీ పేరుతో 2006లో ఆస్పరి చిన్న ఆహోతూరు పెద్ద హోతూరు గ్రామాలలో సేకరించిన 450 ఎకరాల భూములను రైతులకు మంత్రి తిరిగి అప్పగించాలి.

2020-10-13 08:24 GMT

జాతీయం..

-హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

-విచారణ జరిపిన సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం

-వెకేషన్ తర్వాత పిటిషన్ ను విచారిస్తామన్న సీజేఐ

-నవరాత్రి సెలవుల తర్వాత విచారణ జరుపుతామన్న ధర్మాసనం

2020-10-13 08:21 GMT

గుంటూరు...

-పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు...

-అచ్చంపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి వరదనీరు...

-అచ్చంపేట సినిమాహల్‌ సెంటర్‌లోప్రధాన రహదారిపై వరదనీరు...

-అచ్చంపేట కెనాల్ ఆఫీస్‌లోకి చేరిన వరద...

-పలు దుకాణాలలోకి చేరిన వరద...

2020-10-13 08:19 GMT

కృష్ణాజిల్లా...

-గుడివాడ - మచిలీపట్నం విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రాంకృపాల్

-మోటర్ ట్రాలీ పై మచిలీపట్నం వరకు డబ్లింగ్ ట్రాక్ నిర్మాణాన్ని పరిశీలించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు

-రేపటి నుండి డబ్లింగ్ ట్రాక్ పై పట్టాలు ఎక్కనున్నా పలు రైళ్లు

Tags:    

Similar News