Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-09 00:20 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-09 12:37 GMT

ఏసీబీ అప్ డేట్స్......

-మరికాసేపట్లో అరెస్ట్ చేయనున్న ఏసీబీ...

-ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు..

-ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు....

-జూనియర్ అసిస్టెంట్ వసిమ్ హైమ్మద్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు...

-మెదక్ ఇంచార్జ్ కలెక్టర్ నగేష్ బినామీ కోల జీవన్ గౌడ్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..

-నగేష్ ఆడియో టేపులు, డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకున్న ఏసీబీ.

-ఇప్పటికే ఆడియో టేపులు స్వాదీనం

-సోదాలు అనంతరం అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తరలించనున్న ఏసీబీ.

2020-09-09 12:11 GMT

బీజేపీ మీడియా స్టేట్మెంట్.

కె కృష్ణసాగర రావు....ముఖ్య అధికార ప్రతినిధి,

-గవర్నర్ తమిళిసై గారి తొలి ఏడాది పాలన ఎంతో ఫలప్రదంగా సాగింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారితో ఆవిడ కలసిపోయారు, రాజ్ భవన్ ను     సామాన్యులకు చేరువ చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

-రాష్ట్ర రాజ్యాంగాధిపతిగా, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, అన్ని ప్రతిపక్ష పార్టీలూ స్వేచ్ఛగా రాజభవన్ తలుపు తట్టే అవకాశం కల్పించారు     గవర్నర్.

-ఆవిడ భవిష్యత్తు పదవీకాలం మరింత ఫలప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను.

-ఇటువంటి వ్యక్తి గవర్నరుగా రావడం తెలంగాణ ప్రజల అదృష్టం.

2020-09-09 11:56 GMT

సిరియల్ నటి శ్రావణి కేస్ అప్డేట్

-తన చావు కి కారణం సాయి అనే వ్యక్తి అని దేవ్ రాజ్ కి కాల్ చేసి చెప్పుకున్న శ్రావణి...

-కుటుంబ సభ్యుల ఫోర్స్ వలన నాపై తప్పుడు కేసులు పెట్టించారు అని చెప్తున్నా దేవరాజ్..

-సెప్టెంబర్ 7 న నేను శ్రావణి కలిసి డిన్నర్ కి వెళ్లాము అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణి పై చేయి చేసుకున్నాడు....

-శ్రావణి కి సాయి అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి పరిచయం ఉంది అని చెవుతున్న దేవరాజ్...

-సంవత్సరం క్రితం నేను శ్రావణి కి పరిచయం అయ్యాను...

-శ్రావణి కుటుంబ సభ్యులు మరియు సాయి అనే వ్యక్తి ఆమె ను కొట్టి హింసించేవారు...

-నాపై గతం లో ఫిర్యాదు చేసిన తరువాత కూడా ఇద్దరం కలుసుకున్నాము...

-నా చావు కి కారణం సాయి అనే వ్యక్తి అని నాతో చెప్పుకుంది.....

2020-09-09 11:48 GMT

నిజామాబాద్..

-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరిన జలాశయం

-మహారాష్ట్ర నుంచి గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి

-రేపు శ్రీరాం సాగర్ వరద కాల్వ ద్వారా నీటిని విడుదల చేయనున్న అధికారులు

-పరివాక గ్రామాల ప్రజలను మత్స్య కారులు, గొర్రెలు, పశువుల కాపరులను అప్రమత్తం చేసిన అధికారులు

2020-09-09 11:45 GMT

-మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:

-కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలిలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ   మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

-తెలంగాణ ప్రజలకు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

-నిరంత‌రం తెలంగాణ కోసం ప‌రిత‌పించిన కాళోజీ, మాన‌వీయ విలువ‌ల‌ను చాటారు

-మాన‌వ‌తే కేంద్రంగా క‌విత్వాన్ని రాసి ప్రపంచవ్యాప్తం చేశారు

-వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను

-వారి జయంతి ని తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కాళోజీ స్మారక పురస్కారాలు ఇస్తున్నందుకు సీఎం కేసీఅర్ గారికి ఉమ్మడి   వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు

-కాళోజీ ఆశీస్సులతో సీఎం కేసీఅర్ గారి ఆలోచనలతో సాంస్కృతిక తెలంగాణ గా మారుతుంది

-కాళోజీ జీవితమే ఆద‌ర్శంగా తీసుకొని తెలంగాణ‌లో అనేక మంది క‌వులు అయ్యారు

-కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మరోసారి నమస్సుమాంజలి తెలియచేస్తున్నాను

2020-09-09 09:52 GMT

మంత్రి శ్రీనివాస యాదవ్ చిట్ చాట్ @ అసెంబ్లీ ప్రాంగణం బయట..

#కొత్త చట్టం తెచ్చిన సీఎం కెసిఆర్ కు అభినందనలు..

#పనుల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు .. కొత్త చట్టం తో వారికి పెద్ద ఊరట లభించినట్టయింది

#అవినీతి బెడద పూర్తిగా తొలగిపోతుంది

#సీఎం కెసిఆర్ అక్బర్ కు మంచిగా సమాధానమిచ్చారు

#సీనియర్ సభ్యుడైనంత మాత్రాన అక్బర్ ఏదీ పడితే అది మాట్లాడతానంటే కుదరదు

#భట్టి అపర మేధావి లా వ్యవహరిస్తుంటారు ..ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం చేత కాదు

#మంత్రి ఈటెల రాజేందర్ మొత్తం విషయాలను చెప్పాలంటే రెండు రోజులైనా సమయం సరిపోదు


2020-09-09 08:19 GMT

సిద్దిపేట :

-కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటి చైర్మెన్,సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం మృతి...

-కరోనాతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని వాసవి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈరోజు మృతి...

-మృతుని స్వస్థలం దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామం.

2020-09-09 08:13 GMT

-ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్..

-రెవెన్యూ లో కొత్త సంస్కరణలు తీసుకురావాలని సమస్యలు పరిష్కరించడానికి తెచ్చిన చట్టాన్ని రైతులు వరంగా భావిస్తున్నారు..

-ఇలాంటి చట్టం తీసుకురావాలనే ఆలోచన చాలా గొప్ప విషయం

-తెలంగాణలోని చిన్న సన్నకారు రైతులు ఈ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు

-శుక్రవారం ఈ చట్టం పై సీఎం కేసీఆర్ పూర్తిగా వివరించబోతున్నారు..

-దేశ చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది

2020-09-09 08:10 GMT

వరంగల్ అర్బన్..

-మత్తు పదార్థాలకు బానిసైన యువకుడు ఆడేపు అకాశ్ బాబు ఈనెల 3న డబ్బుకోసం మేనత్త శారదను హత్య చేశాడు

-నిందితుడు అక్ష బాబుతో పాటు మరో ఇద్దరి సహాయంతో శారదను హత్య చేశాడు.

-హత్య చేసి బీరువా మీద పడ్డట్లు చిత్రీకరించాడు.

-ఓ బాల నేరస్తుడితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం.

-శారదా కుమారుడు అఖిల్ చికిత్స పొందుతూ ఉన్నాడు.

-వారి నుంచి 2 లక్షల 71వేల నగదు, బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నాం

2020-09-09 07:32 GMT

HMTV తో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ నర్సింహ రెడ్డి....

-గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ కు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ తో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది.

-పరిచయం కాస్త ప్రేమగా మారింది.

-జూన్ లో దేవరాజు పై శ్రావణి ఫిర్యాదు చేసింది..

-ఫిర్యాదు మేరకు దేవరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము

-శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు దేవరాజు అదుపులోకి తీసుకొని విచారిస్తాము

-టిక్ టాక్ పరిచయం తో దేవరాజు శ్రావణి ని వేధింపులకు గురి చేసేవాడనీ శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు..

Tags:    

Similar News