Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-09 00:17 GMT
Live Updates - Page 2
2020-09-09 10:18 GMT

Nara Lokesh Consults Kollu Ravindra: మాజీమంత్రి కొల్లు రవీంద్ర ను పరామర్శించిన నారా లోకేష్..

విజయవాడ..

-ఇటీవల బెయిల్ పై విడుదల అయిన కొల్లు రవీంద్ర

-నారా లోకేష్ ,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

-రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది

-హత్య కేసులో కావాలని కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేశారు

-కొల్లు రవీంద్ర సౌమ్యుడు ,ఎలాంటి తప్పు చేయడు

-ఈఎస్ ఐ లో మంత్రికి ఎలాంటి ప్రమేయం ఉండదు

-36 మంది టిడిపి నేతలపై దొంగ కేసులు పెట్టారు

-18 నెలలు అవుతుంది.. అవినీతి నిరూపించారా

-నేను సవాల్ చేస్తున్నా

-ఆధారాలు ఉన్నాయా.. ఏమి చేశారు

-జగన్ తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నాడు

-మళ్ళీ అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది

2020-09-09 10:02 GMT

Amaravati-Antarvedi updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సుజనా చౌదరి కామెంట్స్..

అమరావతి..

-బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కామెంట్స్..

-అంతర్వేది రథం దగ్ధం ఘటనలో దోషులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు పిలుపునిచ్చిన బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజును     గృహనిర్బంధంలో వుంచడం, బిజెపి కార్యకర్తలను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

-అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనలో దోషులను తక్షణమే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

-ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక దాదాపు 15 చోట్ల హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.

-పిఠాపురం, బుట్టాయగూడెంలో దేవతా విగ్రహాలు ధ్వంసం చేశారు. నెల్లూరులో దేవుని రథాన్ని తగులపెట్టారు.

-అయితే ప్రభుత్వం ఈ ఘటనలకు పాల్పడినవారు మతిస్థిమితం లేనివారనో, తేనే కోసం తగులబెట్టారనో చెప్పడం బాధ్యతారాహిత్యం అవుతుంది.


2020-09-09 09:41 GMT

Guntur updates: జగజ్జీవన్ పేరుతో సీఎంవో లో ఎవరు ఉన్నారంటూ వాకబు చేసిన ఎమ్మెల్యే రజనీ..

గుంటూరు.....

-భారీగా రుణాలు ఇస్తామని ప్రగల్బాలు పలుకుతూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజీనీకి ఫోన్ చేసిన విశాఖ కు చెందిన జగజ్జీవన్ రాం..

-సీఎం స్వయంగా ఫోన్ చేసి మీతో మాట్లాడమన్నారంటూ ప్రగల్బాలు పలికిన జగజ్జీవన్ రాం

-అనుమానం రావటంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే రజనీ..

-జగజ్జీవన్ రాంతో ఫోన్ లో మాట్లాడుతూనే డీజీపీకి, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రజనీ..

-ఫోన్ కాల్ సెల్ సిగ్నల్స్ ఆదారంగా జగజ్జీవన్ రాం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు..

-రాయచోటి ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు కూడ ఫోన్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు..

2020-09-09 09:22 GMT

Amaravati updates: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై అమరావతి జెఏసీ మహిళా నేతల ఆగ్రహం..

అమరావతి..

-మంత్రి కొడాలి నాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి

-చూస్తూ ఊరుకోం.. దమ్ము దులుపుతాం

-చీపుర్లతో నిరసన వ్యక్తం చేసిన జెఎసి మహిళా నేతలు

-నోరు అదుపు - మాట పొదుపు లేని వారికి చీపురుతో దుమ్ము దులుపుతామంటూ పెద్ద ఎత్తున నినాదాలు

-జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాధ

-ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అమరావతే రాజధాని

-అమరావతి రాజధానికి న్యాయ వ్యవస్థ అండగా ఉంది

-సీపీఐ జాతీయ మహిళా నాయకురాలు అక్కినేని వనజ


2020-09-09 09:16 GMT

Amaravati updates: వైసీపీ ఎప్పుడూ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకం..మల్లాది విష్ణు... వైసీపీ ఎమ్మెల్యే...

అమరావతి...

-మల్లాది విష్ణు... వైసీపీ ఎమ్మెల్యే...

-మా ప్రభుత్వంలో అందరూ సమానమే.. అన్ని మతాల్ని గౌరవిస్తున్నాం..

-అంతర్వేది ఘటనను రాజకీయాలకు వాడుకుంటున్నారు..

-బీజేపీ, టీడీపీ, జనసేన ప్రజల్ని తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నాయి..

-ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది.. ఎలాంటివారినైన వదిలిపెట్టం..

-ఇలాంటి నీచ రాజకీయాల చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు..

2020-09-09 09:09 GMT

Antarvedi updates: అంతర్వేది రథం కాల్చివేతపై సీరియస్ దర్యాప్తు జరుగుతుంది..మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... ...

అమరావతి...

-మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... ...

-ప్రతిపక్షాలు కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయి..

-95 లక్షలతో కొత్త రథం నిర్మాణం చెయ్యాలని సీఎం ఆదేశించారు..

-మా ప్రభుత్వానికి దేవాలయాలు, మశీదులు, చర్చి లు అన్ని సమానమే..

-విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, స్వామిజీల సూచనలు పరిగణలోకి తీసుకుంటాం..

-పవన్ కళ్యాణ్ తాను రోజుకో మతం.. పూటకో కులం అంటాడు..

-సోము వీర్రాజు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..

2020-09-09 08:55 GMT

Nellore-Antarvedi radham: అంతర్వేది రథం దగ్ధం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ ఆధ్యాత్మిక సంస్థలు.

నెల్లూరు..

-- నెల్లూరులో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద స్వామీజీలు పీఠాధిపతుల నిరసన

-- రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రథలు విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే హిందూ సంపదపై దాడులు గా భావించాల్సి వస్తోంది.

-- రథం దగ్దం చేయడాన్ని ప్రభుత్వం మాత్రం మతిస్థిమితం లేని వ్యక్తుల పని అంటూ చేతులు దులుపుకుంటుoది

-- రథాల దహనం ముమ్మాటికీ అన్య మతాల కుట్ర గానే భావిస్తున్నాం.

-- హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీసే ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం దురదృష్టం

-- ఇలాంటి దుర్ఘటనలు హిందూ ధర్మంపై దాడి జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది

-- కుట్రదారుల వెంటనే అరెస్టు చేయాలి లేకుంటే ప్రతిగా దీక్షలు చేస్తాం.

2020-09-09 08:35 GMT

YS Jagan review: వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష....

అమరావతి..

అంగన్‌వాడీ కేంద్రాలలో నాడు–నేడు.

పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు.

2020-09-09 07:42 GMT

Visakhapatnam updates: అంతర్వేది సంఘటన పై ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్...

విశాఖ....

-ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్...

-అంతర్వేది సంఘటన పై రాష్ట్రం లో అనేక ధార్మిక సంస్థల ప్రతినిధులు నిరసన చేస్తే అరెస్టు చేయడం దారుణం.

-అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలి.

-కుట్రపూరితంగా ఇంటువంటి సంఘటనలు చేస్తున్నారు.

-రాష్ట్రం లో ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదు.

-మంత్రులు ముఖ్యమంత్రి మెప్పు పొందటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు.

-అంతర్విది సంఘటనపై సి బి ఐ విచారణ జరిపి నిందితులు పై చర్యలు తీసుకోవాలి.

-చలో అంతర్విది కి పిలుపునిచ్చిన విశాఖ లోని బీజేపీ నాయకులు.

2020-09-09 06:46 GMT

Rajahmundry updates: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిసీకామెంట్స్..

తూర్పు గోదావరి జిల్లా...రాజమండ్రి-

-అంతర్వేది సంఘటనపై ప్రభుత్వం జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలి

-అంతర్వేది , పిఠాపురం, నెల్లూరు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి

-తక్షణమే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలి

-అరెస్టు చేసిన మహిళలను యువకులను విడిచిపెట్టాలి

-ప్రభుత్వ మొండినిరంకుశ వైఖరిని బిజెపి సహించదు

-ఇవాళ, రేపు ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తాం

-11వ తేదీన ఎమ్మార్వో కార్యాలయాల వద్ధ ఆందోళన చేసి వినతి పత్రాలు సమర్పించాలి

-వీ హెచ్ పీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం

-క్రైస్తవ చర్చిలపై దాడులు వేస్తే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది...

-మరి హిందువుల ఆలయాలపై దాడులు, రథాల విషయంలో సీరియస్ గా ఎందుకు లేదు

-ప్రభుత్వంపై కుట్ర జరిగితే అధికారంలో వున్నవారు వాస్తవాలు బయటపెట్టాలి.

Tags:    

Similar News