Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 09 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి రా.12-18 తదుపరి దశమి | మఖ నక్షత్రం తె.4-05 తదుపరి పుబ్బ | వర్జ్యం సా.4-18 నుంచి 5-52 వరకు | అమృత ఘడియలు రా.1-43 నుంచి 3-18 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-23
ఈరోజు తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా ...
-జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కిస్టాయ పల్లి రహదారిపై వెళ్తున్న బైకు, కారు ఢీ కొనడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధం.
-మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది.
-ఇరువురి కి స్వల్ప గాయాలు
జాతీయం..
-గడిచిన 24 గంటల్లో 8,35,401 టెస్టులు నిర్వహణ
-దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,85,72,192 టెస్టులు నిర్వహణ
-దేశవ్యాప్తంగా 2074 లాబ్స్ లో జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు
-కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉన్న 1141 ప్రభుత్వ లాబ్స్,933 ప్రైవేట్ లాబ్స్ - ఐసీఎంఆర్
నిజామాబాద్..
-జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర దాడిలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మహేష్ కుటుంబానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ కవిత..
-వీర జవాన్ కు నివాళ్ళు అంటూ ట్విట్ చేసిన కవిత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-6 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 98,20 మీటర్లు
-ఇన్ ఫ్లో 8,600 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 5,500 క్యూసెక్కులు
నిజామాబాద్
-జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్ కు నివాళి తెలిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
-దేశ రక్షణ కోసం సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది.
-వీర సైనికుడు మహేష్ కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుంది.
-మహేష్ తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు నా జోహార్లు
-వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
-వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న-స్పీకర్ పోచారం
హైదరాబాద్..
-ఉదయం 10.30 జూబ్లీహిల్స్ లెదర్ పార్క్ ప్రారంభం
-11 గంటల కు రోడ్ నెంబర్ 45 నుంచి ఓల్డ్ ముంబై హావే కు లింక్ రోడ్
-11.30 గంటలకు ఖాజాగుడా గచ్చిబౌలి లింక్ రోడ్
-12 గంటలకు మియాపూర్ నిజాంపేట్ లింక్ రోడ్ ల ప్రారంభం
-నగరంలో వరద సహాయం అందని భాదితులు భాదితులు ఆందోళనలు చేసే అవకాశం ఉందని భారీగా పోలీస్ బందోబస్తు
నిజామాబాద్:
-జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన మహేష్ కు ఘన నివాళి ప్రకటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.
-మహేష్ త్యాగం మరువలేనిది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం స్ఫూర్తి దాయకం.
-వీర సైనికునికి యావత్ తెలంగాణ నివాళులు అర్పిస్తుంది.
-మహేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
-మహేష్ తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు : మంత్రి ప్రశాంత్ రెడ్డి.
ఆదిలాబాద్ జిల్లా..
-కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 9.5డిగ్రీలు నమోదు
-ఆదిలాబాద్ జిల్లా అర్లి టి 9.7 డిగ్రీలు
-బేలలో 10.డిగ్రీలు నమోదు
-తాంసిలో 10.1 డిగ్రీలు నమోదు
-చలి వణుకుతున్నా ప్రజలు
-చలి నుండి రక్షించుకోవడానికి చలిమంటలు కాచుకుంటున్నా ప్రజలు