Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-05 23:30 GMT
Live Updates - Page 2
2020-08-06 14:17 GMT

కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డి

కడప :

- కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన తాడిపత్రి టిడిపి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డి

- జైలు నుంచి బయటకు వచ్చి తాడిపత్రికి పయనం

- తాడిపత్రి నుంచి భారీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తలు

2020-08-06 14:16 GMT

సినీ నటులు చిరంజీవి తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్ రాజు..

- మాజీ కేంద్ర మంత్రులు ప్రముఖ సినీ నటులు చిరంజీవి తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్ రాజు.

- మర్యాద పూర్వక భేటీ అంటున్న బీజేపీ నేతలు.

- సోము వీర్రాజు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.

- బిజెపి జనసేన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ ,సహకారంతో వీర్రాజు ముందుకెళ్లాలని చిరంజీవి ఆకాంక్షించారు.

2020-08-06 14:15 GMT

ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు: మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి:

- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

- ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు.

- నూతన జాతీయ విద్యా విధానం వచ్చాక ఎలా విద్యారంగాన్ని ముందుకు‌తీసుక వెళ్లాలి

- మంచి పాఠ్య ప్రణాళికతో విద్యా సంవత్సరం ప్రారంభిస్తాం.

- గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో 90 శాతం కు సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

- వృత్తి విద్యా నైపుణ్యాభి వృద్ధి, ఉపాధి కల్పించే విధంగా డిగ్రీ నాలుగు ఏళ్లపాటు ఆనర్స్ కోర్సులు వుంటుంది.

- బిటెక్ ఆనర్సు కోర్సు లు గా‌ రూపొందించాం.

- ప్రకాశం, విజయనగరం లలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు.

- ప్రకాశం జిల్లాలో టీచర్స్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు.

- ఈ యూనివర్సిటీ ద్వారా టీచింగ్ లో కొత్త కోర్సులు తీసుకవస్తున్నాం

- ప్రభుత్వ కాలేజిలను గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చేశాయి.

- జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అనేక సంస్కరణ తెచ్చింది.

- అక్టోబరు 15 లోగా కాలేజిలు ప్రారంభిస్తాం.

- కామన్ ఎంట్రెన్స్ టెస్టులు సెప్టెంబరు మూడవ వారం నుండి ప్రారంభిస్తాం.

2020-08-06 14:13 GMT

అనపర్తి శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్..

తూర్పుగోదావరి :

- సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే..

- తన ఆరోగ్యంపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరిన ఎమ్మెల్యే..

- చికిత్స నిమిత్తం హైదరాబాద్ పయనమైన ఎమ్మెల్యే..

-తన కార్యాలయంలో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని వెల్లడించిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి..

2020-08-06 12:41 GMT

కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా..

శ్రీకాకుళం జిల్ల:

- మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్లలోనే ఆత్మహత్యకు యత్నించిన మహిళ..

- కేసు విషయంలో తన కుమారుడిని కోటబొమ్మాలి ఎస్.ఐ కొట్టారని మహిళ యర్రమ్మ ఆందోళన..

- స్టేషన్ లొనే శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించిన యర్రమ్మ..

- యర్రమ్మను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

2020-08-06 12:36 GMT

తిరుమలలో విషాదం..

- శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి.

- కొద్దీ రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పై తిరుమలకు వచ్చిన అర్చకుడు.

- వారం క్రిత్తం కరోనా నిర్దారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్ కు తరలించిన టీటీడీ.

- స్విమ్స్ లో చికిత్స పొందుతూ కాసేపటి క్రిత్తం మృతి చెందిన అర్చకుడు.

- తోటి అర్చకుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో అర్చకులు.

- అధికారికంగా దృవీకరించని టీటీడీ.

2020-08-06 12:35 GMT

అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు: ఎమ్మెల్యే పార్థసారథి

అమరావతి:

- అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయం పడుతున్నాడు..

- తన ఎమ్మెల్యేలు పోయిన పర్వాలేదు తనకు అమరావతి ముఖ్యమనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..

- రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది..

- ఐదు వేల కోట్లు అమరావతి కోసం చంద్రబాబు ఖర్చు చేశారు..

- 52 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారు..

- కోర్టులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారు..

- చంద్రబాబు అమరావతి కోసం ఎక్కడ 52 వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పాలి..

- crdaను చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఆదరిటీగా మార్చేశారు...

- అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడు..

- ఇష్టానుసారంగా రాజధానిలో తన బినామిలకు చంద్రబాబు భూములు ధారాదత్తం చేసాడు..

- అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న వారు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు..

- అమరావతి మీద ప్రేమతో కాదు వాళ్ళ వ్యాపారం కోసం ఉద్యమం చేయిస్తున్నారు..

- అమరావతి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము..

- పవన్ కళ్యాణ్ గుంటూరు కృష్ణ జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అజ్ఞాతివాసిగా మాట్లాడుతున్నారు..

- మాకు అన్ని ప్రాంతాలు సమానాభివృద్దే ముఖ్యం..

- రాజధాని రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పిన టీడీపీ నేతలు బుద్ది లేకుండా ఇంకా కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడుతున్నారు..

- జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి ఎల్లో మీడియా చూపిస్తుంది..

- రాజధానికి ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు..

- చంద్రబాబు మతి భ్రమించి వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు..

- గతంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్లారు..

- కేసీఆర్ తెలంగాణ వాదం కోసం గతంలో ఉప ఎన్నికలకు వెళ్లారు..

- అమరావతిపై చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాడనికి భయపడుతున్నారు..

2020-08-06 12:31 GMT

కడప :

- కడప కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న జెసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డి....

- భారీగా చేరుకున్న అభిమానులు, టిడిపి శ్రేణులను...

- కేంద్ర కారాగారం వద్దకు వచ్చిన అనుచరులు, అబిమానులను తరిమి వేసిన పొలీసులు

2020-08-06 12:30 GMT

అరకు ఏమ్మేల్యే శెట్టి పాల్గుణ కామెంట్స్

విశాఖ జిల్లా:

- తనకు కరోనా వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ చెప్పారు

- తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చి తగ్గిపోయిందని తాను వారిని కలవను కూడా లేదని పేర్కొన్నారు

- కరోనాను తరిమి కొట్టడానికి అందరూ ముందుకు రావాలని కోరారు

- రేపటి నుండి పది రోజుల పాటు అరకు స్వచ్చ లాక్ డౌన్ ప్రకటించటం జరిగిందని అందరూ సహకరించాలని కోరారు

2020-08-06 12:27 GMT

అమరావతి:

- ప్రకాశం జిల్లాలో పేదలకు కేటాయించాలని నిర్ణయించిన 1367 ఎకరాల మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదని కోర్టుకి తెలిపిన ఏపీ ప్రభుత్వం

- మైనింగ్ కు అనుకూలంగా లేవని పిటిషనర్ తండ్రి అఫిడవిట్ ఇచ్చారన్న ప్రభుత్వం

- అఫిడవిట్ అవాస్తవమని ప్రభుత్వ నిర్ణయం సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ

- విచారణలో భాగంగా ఈ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని కోర్టుకి తెలిపిన ప్రభుత్వం

- ఈ నెల 13కి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Tags:    

Similar News