Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-05 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 05 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-05 13:42 GMT

# కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్న వివిధ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి  సమావేశం

# విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు

#ప్రస్తుత సంక్షోభ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న సలహాలు సూచనల ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటామని తెలిపిన మంత్రులు

#విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్ల జీతభత్యాల చెల్లింపులో యాజమాన్యాలు మరింత ఉదారంగా వ్యవహరించాలి

# గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల బలోపేతానికి ప్రభుత్వ చర్యలు

# విద్యా కార్పొరేటీకరణ కు తాము వ్యతిరేకమని తెలిపిన మంత్రులు

# గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్య అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పిన వారి పట్ల తమకు సానుకూల దృక్పథం ఉంటుందని తెలిపిన మంత్రులు

2020-10-05 13:38 GMT

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి @ సత్యాగ్రహ దీక్ష...

-బిజెపి ప్రభత్వం నుండి ఇప్పటి వరకు ఎవరూ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు...

-పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ ,ప్రియాంక గాంధీ పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు..

-డిల్లీ , యూపీ బార్డర్ లో లాఠీ చార్జీ జరిగింది దానిని అడ్డుకోబోయిన ప్రియాంక గాంధీ పట్ల మగ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు..

2020-10-05 13:13 GMT

ఎమ్మెలే సీతక్క..

-త్యాగాల నేతలు ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ లు బాధల్లో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్తున్న వారిపై పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదు...

-దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే కనీసం వెళ్లి పరామర్శించ లేదు ..

-మోయిన బాద్ లో టీఆరెఎస్ నాయకుడు ఓ అమ్మాయి పై దాడి చేసి హత్య చేశాడు..

-ఆ అమ్మాయి కుటుంబానికి ఇంతవరకు ప్రభుత్వం బరోసా ఇవ్వలేదు..

-రాష్ట్రంలో డ్రగ్స్ క్లబ్స్ కు పెరుగాంచుతుంది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది..

2020-10-05 12:59 GMT

హైదరాబాద్..

-టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ను కలిసిన తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ..

-వరంగల్ ,నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజవర్గం లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపిన చెరుకు సుధాకర్

2020-10-05 12:51 GMT

ఎల్బీ నగర్...

మహేష్ భగవత్, రాచకొండ సీపీ..

-బీహార్ నుండి హైద్రాబాద్ కు బాల కార్మికులను తీసుకువచ్చి పని చేయిస్తున్న ముటాను  అదుపులోకి తీసుకున్నారు..

-20 మంది చైల్డ్ లేబర్ తో గాజుల కంపెనీలో బలవంతంగా పని చేపిస్తున్నారు..

-ఐదుగురు నిర్వహకులను అరెస్ట్ చేసిన పోలీసులు...

-బయట నుండి తాళాలు వేసి..ఉదయం8 నుండి రాత్రి 11 గంటల వరకు పిల్లలతో పని చేపిస్తున్నారు..


2020-10-05 12:42 GMT

హేమంత్ కేస్ అప్డేట్.....

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు.....

-హేమంత్ మర్డర్ కేస్ లో పరారీలో ఉన్న ఎరుకాల కృష్ణ,మహమ్మద్ పాషా ( లడ్డు),రాజు ,సాయన్న ను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు....

-ప్రేమ వివాహం నచ్చకపోవడంతో హేమంత్ ను చంపాల్సి వచ్చిందని కస్టడీలో ఉన్న లక్ష్మ రెడ్డి ఒప్పుకున్నాడు....

-మిగతా ఏడూ మందిని కూడా పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం....

-గచ్చిబౌలి సిఐ శ్రీనివాస్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా ఈ కేస్ బాధ్యతలు గచ్చిబౌలి డిఐ కాస్ట్రో చూస్తారు....

-బెగారి సాయన్న పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రౌడి షీట్ ఉంది....

-అవంతిక రెడ్డి సొంత తమ్ముడు ఆశిష్ రెడ్డి పాత్ర ఇందులో ఇప్పటివరకు లేదని మా విచారణలో తేలింది....

-ఈ కేసులో మరింతగా దర్యాప్తు చెయ్యాల్సి ఉంది....

2020-10-05 12:35 GMT

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా:

-రాయ‌ప‌ర్తి మండలం బాలాజీన‌గ‌ర్ తండాలో 25 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి  స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

-పాల్గొన్న మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ నాయ‌క్, ఆయ‌న స‌తీమ‌ణి డాక్ట‌ర్ ల‌క్ష్మీ, తల్లిదండ్రులు బానోత్ కేవ్ లా నాయ‌క్, బాజు బాయి లు

-ఎమ్మెల్యే సొంతూరు బాలాజీ నగర్ తండా లోని 25 డ‌బుల్ బెడ్ రూం లకు ఒక్కో ఇంటికి రూ.50వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే

-శంక‌ర్ నాయ‌క్ త‌ల్లిదండ్రులు

-ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ కుటుంబాన్ని అభినందించిన మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు

2020-10-05 12:18 GMT

గాంధీ భవన్..

-హత్రాస్ సంఘటన ఖండిస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నిరసనగా కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం...

-మహిళలకు రక్షణ కల్పించడంలో యూపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిజాలు దాచి తప్పులు కప్పి పుచ్చడానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు   చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష..

-బాధితులను ఓదార్చడానికి వెళ్తున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పై దురుసుగా ప్రవర్తించడన్ని ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది..

-సత్యాగ్రహ దీక్ష లో కూర్చున్న టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ   జీవన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, విహెచ్ తదితర కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్నారు...

2020-10-05 12:11 GMT

హైదరాబాద్.. 

-భూ కబ్జా చేస్తూ బెదిరింపు లకు పాల్పడిన మహిళా ఇన్స్పెక్టర్

-గతంలో కూడా భూ వివాదంలో కేసు నమోదు కావడంతో సస్పెండ్ కి గురైన ఇన్స్పెక్టర్

-తాజా గా మరో మారు కేసు నమోదు

-3 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడంతో పాటు బాధితులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు

2020-10-05 12:06 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలు లేదా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం సేకరించింది.

#11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లు ఉండగా..

#8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తమ అభిప్రాయం తెలిపాయి..

#బీజేపీ మాత్రమే ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది..

#2 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం తెలపలేదు..

#పార్టీ గుర్తు లేని 39 రాజకీయ పార్టీలు ఉండగా..

#18 పార్టీ లు అభిప్రాయం చెప్పాయి..

#11పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి..

#మొత్తం 50 పార్టీ లు ఉండగా...అందులో 26రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం చెప్పగా..13పార్టీలు బ్యాలెట్ ,3పార్టీ లు ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి..

#వీవీ ప్యాడ్ ల తయారి కోసం ఈసిఐ ఢిల్లీ కి లేఖ రాసాం...రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం...

Tags:    

Similar News