Live Updates: ఈరోజు (04 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-04 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 04 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ పూర్తిగా | అశ్వని ఉ.10-48 వరకు తదుపరి భరణి | వర్జ్యం: ఉ..06-22 నుంచి 08-08 వరకు తిరిగి రాత్రి ౦9.26 నుంచి 11.22 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-04 06:23 GMT

విశాఖ జిల్లా.. 

-విశాఖ NAD ఫ్లైఓవర్ గోపాలపట్నం వైపు వెళ్లే మార్గాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ

-ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎం.పి ఎంవివి సత్యనారాయణ, జిల్లా అధికారులు.

2020-10-04 06:16 GMT

తూర్పు గోదావరి....

అమలాపురం....

-అమలాపురానికి చెందిన డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చోటు..

-2025 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యంగా నేషనల్ IMA ఆరుగురితో కమిటీ ఏర్పాటు..

-ఆ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ పి ఎస్ శర్మ కి చోటు..

-డాక్టర్ శర్మ ను అభినందించిన కీమ్స్ ఎండీ రవివర్మ.. డీన్ డాక్టర్ కామేశ్వరరావు

2020-10-04 06:10 GMT

తూర్పుగోదావరి :

-పెద్దాపురం మం. కాండ్రకోట వద్ద ఏలేరు వరద ఉధృతికి డబ్బా కాలువ పై కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన

-కాండ్రకోట - తూర్పుపాకల మధ్య నిలిచిన రాకపోకలు..

-కాండ్రకోట, తూర్పుపాకల, తిమ్మాపురం, కట్టమూరు గ్రామాల రైతులు వినియోగించే వంతెన కూలిపోవడంతో అవస్థలు పడుతోన్న రైతులు..

2020-10-04 06:07 GMT

విజయనగరం...

-గర్బిణి మహిళను వైద్యం కోసం 11 కిలోమీటర్ల డోలీలో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు

-శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతి పొర్లు గామానికి చెందిన చంద్రమ్మ అనే గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో గ్రామంలో వైద్య   సదుపాయం లేకపోవడంతో డోలిలో దబ్బగుంట వరకు తీసుకు వచ్చిన బందువులు

-దబ్బగుంట నుండి 108లో శృంగవరపుకోట హాస్పిటల్ కు తరలింపు

2020-10-04 06:02 GMT

తూర్పుగోదావరి:

-సూరంపాలెం వద్ద జరిగిన ఘటన

-లారీ బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్

-వర్షం కారణంగా జారుడు వల్ల అదుపుతప్పి బోల్తా పడిన ట్యాంకర్

2020-10-04 03:59 GMT

జాతీయం..

-కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం ఆందోళనకరం.

-కరోనా పాజిటివ్‌గా తేలిన రోజే ట్రంప్‌కు కృత్రిమ శ్వాస కల్పించినట్లు వైట్‌హౌస్‌ వర్గాల సమాచారం.

-మిలటరీ ఆస్పత్రికి తరలించడానికి ముందే అధ్యక్ష భవనం వైద్యులు ట్రంప్‌నకు ఆక్సిజన్‌తో శ్వాస కల్పించారని వార్తలు

-రాబోయే 48 గంటల అత్యంత కీలమని వైద్యులు ప్రకటన.

-74 ఏళ్ల వయసు గల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ధృవీకరణ.

-ప్రస్తుతం ఆయనకు రెమ్‌డెసీవీర్‌తో పాటు యాంటీబాడీలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు

2020-10-04 03:24 GMT

విజయవాడ.

-టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కార్ అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు

-ఇంటి బయట పెట్టిన కార్ ముందు, వెనుక అద్దాలు పగలగొట్టి న దుండగులు

-సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

2020-10-04 03:20 GMT

విజయనగరం ..

-పార్వతీపురం రెల్లివీధిలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు భారీగా పట్టుబడ్డ నాటుసారా

-650లీటర్ల నాటుసారా,9 బైక్ లు సీజ్, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

2020-10-04 03:15 GMT

నెల్లూరు :-

-- ఇన్ ఫ్లో 40వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 29,736 క్యూసెక్కు లు.

-- ప్రస్తుత నీటి మట్టం 74.14 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

2020-10-04 03:02 GMT

కర్నూలు జిల్లా...

-1 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత

-ఇన్ ఫ్లో : 55,246 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో : 63,374 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు

-ప్రస్తుతం : 884.70 అడుగులు

-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

-ప్రస్తుతం: 213.8824 టీఎంసీలు

-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Tags:    

Similar News