Live Updates: ఈరోజు (సెప్టెంబర్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-02 00:56 GMT
Live Updates - Page 3
2020-09-02 06:41 GMT

Guntur updates: జనసేన అధినేత పవన్ కళ్యాణ జన్మదినం సందర్భంగా జిజిహెచ్ కు 14 ఆక్సిజన్ సిలిండర్ లు అందజేత...

గుంటూరు....

-జనసేన అధినేత పవన్ కళ్యాణ జన్మదినం సందర్భంగా జిజిహెచ్ కు 14 ఆక్సిజన్ సిలిండర్ లు అందజేత.

-సూపరింటెండెంట్ సుధాకర్ కు సిలిండర్ లు అందజేసిన జనసేన నేత తులసి ధర్మచరణ్, బిజేపి నేత డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్

2020-09-02 06:33 GMT

YSR Vardhanthi in Nellore: జిల్లావ్యాప్తంగా వైయస్ వర్ధంతి కార్యక్రమాలు..

నెల్లూరు స్క్రోలింగ్:--

-- జిల్లావ్యాప్తంగా వైయస్ వర్ధంతి కార్యక్రమాలు.

-- గ్రామ గ్రామాన వైఎస్ విగ్రహాలకు నివాళులర్పిస్తున్న వైసీపీ శ్రేణులు.

-- జిల్లా కేంద్రంలో లో వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఏపీ ఇరిగేషన్ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్.

-- ప్రజాస్వామ్య వ్యవస్థలో నవ శకానికి నాంది పలికిన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైయస్.

--ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటి రంగాల అభివృద్ధికి బీజాలు వేసిన దార్శినికుడు డాక్టర్ వైయస్.

-- డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

-- తండ్రి ఆశయాలే లక్ష్యంగా, రాష్ట్ర అభవృద్ధి కి కృషి చేస్తున్న నాయకుడు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి.

-- వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చిన మంత్రి అనీల్, ఎన్ డి డి సి బీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి.

2020-09-02 06:25 GMT

Rajahmundry-Amalapuram updates: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమైన జనసైనికులు..

తూర్పు గోదావరి జిల్లా- రాజమండ్రి- అమలాపురం..

-పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పాడైన ఈదర పల్లి నుంచి ఇందుపల్లి ఆర్ అండ్ బి రోడ్డు రెండు కిలోమీటర్లు రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు     సిద్ధమైన జనసైనికులు

-అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టరాదంటూ అడ్డుకున్న పోలీసులు

-ఆర్ అండ్ బి, సబ్ కలెక్టర్ నుంచి అనుమతి తెచ్చుకోవాలని జనసైనికులకు సూచించిన పోలీసులు

-ఈదర పల్లి, ఇందుపల్లి బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు

-రోడ్డు రిపేర్లు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఆర్అండ్ బీ అధికారులు

-ఈదరపల్లి బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత ..

2020-09-02 06:16 GMT

YSR Vardhanthi in Vizag: వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు..

విశాఖ:

-వైస్సార్ 11 వ వర్ధంతి సందర్భాగా బీచ్ రోడ్డులోని వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి   శ్రీనివాస్, వైసీపీ పార్టీ నాయకులు.

-పేద మహిళలకు బియ్యం,చీరలు ఎంపిణీ చేసిన విజయసాయిరెడ్డి.

2020-09-02 05:59 GMT

Atchannaidu inTirumala: తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అచ్చెన్నాయుడు..

-తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అచ్చెన్నాయుడు

-ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

-ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టైన అచ్చెన్నాయడుకి ఇటీవలె బెయిల్‌ లభించింది.

-అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

-ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

-ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్న.. నేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

2020-09-02 05:42 GMT

YSR vardhanthi in Rayachoti: వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానం.

కడప :

-రాయచోటిలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి, విగ్రహానికి, వైఎస్ఆర్ సర్కిల్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానం.

-పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఆభిమానులు, పార్టీ శ్రేణులు.

2020-09-02 05:40 GMT

Bommana Raj Kumar Death: బొమ్మన రాజ్ కుమార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్

తూర్పుగోదావరి:

-ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ది.జాంపేట కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజ్ కుమార్ పార్ధివదేహానికి     నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్,

-రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాన్ని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు

2020-09-02 05:16 GMT

Visakhapatnam updates: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్..

విశాఖ..

-రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కామెంట్స్

-దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మన నుంచి దూరమైన ప్రజలు గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

-విశాఖను అభివృద్ధి చేసిన వ్యక్తి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి.

-కరోనా కష్ట కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అభినందనలు.

-రానున్న జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురవేయాలి.

-ఎన్నికలు ముందు ప్రతి వార్డు లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటాను.

-మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్

-తండ్రి బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు.

-చంద్రబాబు నాయుడు ఎన్ని కుటిల రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆపలేరు.

-రాజశేఖర్ రెడ్డి మన నుంచి భౌతికంగా దూరం అయిన రాష్ట్ర ప్రజలు గుండెలలో ఉన్నారు.

2020-09-02 05:11 GMT

Ysr Vardhanthi in Kurnool: వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన వైసీపీ నేతలు..

కర్నూలు:

-వైఎస్సార్ వర్ధంతి సందర్బంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించిన వైసీపీ నేతలు..

-వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి బి.వై రమయ్యా..

2020-09-02 04:49 GMT

YSR's Vardhanti: వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న వైఎస్సార్సీపీ ప్రముఖులు..

కడప : 

-వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న డిప్యూటి సిఎం ఎస్ బి అంజద్ భాష,

-బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సి. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి,

-విప్ కొరముట్ల శ్రీనివాసులు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి,

-ఎంఎల్సీలు వెన్నుపూస గోపాల్ రెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి

Tags:    

Similar News