వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి

Update: 2019-01-31 07:23 GMT

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరుతానంటూ గత వారమే ప్రకటించిన ఆయన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. మేడాతో పాటు ఆయన అనుచరులకు వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలోని రాజంపేటలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి విజయం సాధించిన మేడా మల్లికార్జున రెడ్డి పార్టీలోని ఆధిపత్య పోరు కారణంగా టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మేడా, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Similar News